Covid-19: మీకోసం మేమున్నాం
దేశంలో కరోనా రెండో దశ తీవ్రత ప్రమాదకరంగా మారింది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు...
టీమ్ఇండియా ఆటగాళ్ల ఔదార్యం..
దేశంలో కరోనా రెండో దశ తీవ్రత ప్రమాదకరంగా మారింది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఆస్పత్రుల్లో సరైన వసతులు లేక, ఆక్సిజన్ కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే మనసున్న ఎంతో మంది తోచినంత సాయం చేస్తూ ఈ కష్టకాలంలో కొంతమందినైనా కాపాడుతున్నారు. అలాగే టీమ్ఇండియా క్రికెటర్లు సైతం ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఈ మధ్య ముందుకు వచ్చారు. కొంతమంది ఆటగాళ్లు సొంతంగా సాయమందిస్తుండగా మరికొందరు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.
మీతోపాటే మేము..
టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అందరికన్నా ముందు స్పందించాడు. ఐపీఎల్ జరుగుతుండగానే ‘మిషన్ ఆక్సిజన్’ అనే ఛారిటబుల్ ట్రస్టుకు రూ.20లక్షలు ప్రకటించాడు. అలాగే ఐపీఎల్లో మ్యాచ్ల్లో తన వ్యక్తిగత ప్రదర్శనలకు లభించే అవార్డుల మొత్తాన్ని సైతం ఆ సంస్థకే అందజేస్తానన్నాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. తమ వంతుగా రూ.2కోట్లతో ఈ మహత్కార్యాన్ని ప్రారంభించారు. తొలుత దాని లక్ష్యాన్ని రూ.7 కోట్లుగా నిర్ణయించుకోగా వారికి ఎంపీఎల్ క్రీడా ఫౌండేషన్ రూ.5 కోట్లు ఆర్థిక సాయం అందజేసింది. దాంతో ఇప్పుడా లక్ష్యాన్ని రూ.11 కోట్లుగా మార్చుకోవడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సహాయం సరిపోదని, వీలైనంత మేర సహాయం చేయాలని విరాట్ దంపతులు కోరుతున్నారు.
ఆపదలో ఆదుకుంటున్నారు..
మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఈ వైరస్ నుంచి కోలుకున్నాక ‘మిషన్ ఆక్సిజన్’కు భారీ మొత్తంలో విరాళం అందజేసినట్లు తెలిపారు. తాను ఆడే రోజుల్లో ఈ దేశం ఎంతో ఇచ్చిందని, దాన్ని ఇప్పుడు తిరిగి ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన టీమ్ఇండియా సోదరులు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తమవంతుగా 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేయడానికి ముందుకొచ్చారు. అలాగే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. కొవిడ్ పేషెంట్ల కుటుంబాలకు ఉచిత భోజన సౌకర్యాలు కల్పించడమే కాకుండా తన సంస్థకు వచ్చే విరాళాలతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేస్తున్నట్లు చెప్పాడు. ఎవరైనా తన ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వొచ్చని కోరుతున్నాడు. యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ సైతం హేమ్కుంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్, కొవిడ్ రిలీఫ్ కిట్లు అందజేయడానికి ఆసక్తి చూపాడు. ఇక హనుమ విహారి, సురేశ్ రైనా, వృద్ధిమాన్ సాహా లాంటి క్రికెటర్లు ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం కావాలంటే తమ సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్ల సహాయం అభ్యర్థిస్తున్నారు.
ఐపీఎల్ నుంచే ముందడుగు..
ఐపీఎల్ 14వ సీజన్ నడుస్తుండగానే పలువురు ఆటగాళ్లు, ఫ్రాంఛైజీలు కొవిడ్పై పోరాటానికి ముందుకొచ్చారు. చెన్నై బౌలర్ జేసన్ బెరెండార్ఫ్ యూనిసెఫ్కు విరాళం అందజేస్తానని చెప్పగా కోల్కతా బౌలర్ పాట్కమిన్స్ 50 వేల డాలర్లు ప్రకటించాడు. అలాగే ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్లీ ఒక క్రిప్టో బిట్కాయిన్ను విరాళంగా అందజేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ.7.5 కోట్ల విరాళం ఇవ్వడానికి ముందుకు రాగా దిల్లీ క్రికెట్ అసోసియేషన్ రూ.1.5కోట్ల విరాళం ప్రకటించింది. పంజాబ్ బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ సైతం తన ఐపీఎల్ ఆదాయంలో కొంతమేర విరాళంగా ప్రకటించాడు. పంజాబ్ ఫ్రాంఛైజీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేయనున్నట్లు వెల్లడించింది. రాజస్థాన్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ తన ఐపీఎల్ ఆదాయం నుంచి పది శాతం ప్రకటించాడు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా కూడా 50వేల డాలర్లను విరాళంగా ప్రకటించడం గొప్ప విశేషం. ఏదేమైనా ఈ కష్టకాలంలో వీరంతా తమకు తోచిన సాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా కొంతమంది ప్రాణాలనైనా కాపాడుతున్నారు. ఆ విషయంలో వీరు చేస్తున్న కృషిని ఎవరైనా అభినందించాల్సిందే.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా