WPL Final: కప్పు ఎవరిదో.. టాస్ నెగ్గిన దిల్లీ క్యాపిటల్స్
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో ఆఖరి అంకానికి వేళైంది. దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
దిల్లీ: డబ్ల్యూపీఎల్ (WPL) రెండో సీజన్లో ఆఖరి అంకానికి వేళైంది. దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన దిల్లీ బ్యాటింగ్ ఎంచుకొని.. బెంగళూరుకు బౌలింగ్ అప్పగించింది. ఐపీఎల్లో ఇప్పటివరకూ ఈ ఫ్రాంఛైజీల్లో ఏ పురుషుల జట్టూ విజేతగా నిలవలేదు. ఇప్పుడు అమ్మాయిల్లో ఏ జట్టు జయకేతనం ఎగరేస్తుందో చూడాలి. జట్లు ఇవే..
బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్హామ్, దిశా కసత్, శ్రేయాంకా పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్
దిల్లీ: మెగ్ లానింగ్ (కెప్టెన్), షెఫాలి వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజేన్ కాప్, జెస్ జొనాసెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా (వికెట్ కీపర్), శిఖా పాండే, మిన్ను మణి
ఇది దిల్లీ బలం..
నిరుడు తుదిపోరులో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిన దిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. మెగ్ లానింగ్ సారథ్యంలో ఉత్తమ ప్రదర్శనతో సాగుతోంది. లీగ్ దశలో 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ చేరింది. కెప్టెన్ లానింగ్ (308 పరుగులు) బ్యాటింగ్లో రాణిస్తూ జట్టును విజయాల వైపు నడిపిస్తోంది. షెఫాలి వర్మ (265), జెమీమా రోడ్రిగ్స్(235), అలీస్ క్యాప్సీ (230) కూడా బ్యాటింగ్లో కీలకం కానున్నారు. బౌలింగ్లో చూసుకుంటే పేస్ ఆల్రౌండర్ మరిజేన్ కాప్ (11), స్పిన్నర్లు జొనాసెన్ (11), రాధా యాదవ్ (10) నిలకడగా రాణిస్తున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్న కాప్ పవర్ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెడుతోంది.
తడబాటును దాటి పుంజుకున్న ఆర్సీబీ
మరోవైపు తడబాటును దాటి, బలంగా పుంజుకున్న ఆర్సీబీ లీగ్ దశలో 8 మ్యాచ్ల్లో నాలుగు చొప్పున విజయాలు, ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయికి షాకిచ్చిన ఈ జట్టు.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టులో ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ కీలకంగా మారింది. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానంలో ఉన్న ఆమె (312).. 7 వికెట్లూ పడగొట్టింది. మంధాన (269), రిచా ఘోష్ (240) కూడా బ్యాట్తో సత్తాచాటితే ఆర్సీబీకి తిరుగుండదు. బౌలింగ్లోనే ఆ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్