Rahane: అదే రహానె సమస్య.. ఇలాగైతే మళ్లీ కష్టాలు తప్పవు: వసీమ్ జాఫర్
విండీస్తో (WI vs IND) జరుగుతున్న టెస్టు సిరీస్లో అజింక్య రహానె ప్రదర్శన నిరాశపర్చింది. జట్టులోని ఇతర ఆటగాళ్లు అదరగొడుతున్న వేళ.. రహానె మాత్రం విఫలం కావడం అభిమానుల్లో కలవరం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె (Ajikya Rahane) తన ప్రదర్శనతో మళ్లీ నిరాశపరిచాడు. విండీస్తో తొలి టెస్టులో (3 పరుగులు) విఫలమైన రహానె.. రెండో టెస్టులోనూ 8 పరుగులకే పెవిలియన్కు చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడటంతో విండీస్ పర్యటనకు (WI vs IND) ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. ఇప్పుడు మళ్లీ పరుగుల కోసం చెమటోడ్చాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో స్థానం నిలవాలంటే రహానె నిలకడగా పరుగులు చేయాలని, లేకపోతే యువ క్రికెటర్ల నుంచి ముప్పు తప్పదని హెచ్చరించాడు. రహానె బ్యాటింగ్లో నిలకడలేమి ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్నాడు.
‘‘రహానె నిలకడగా తన బ్యాటింగ్ ప్రదర్శన చేయాలి. కెరీర్లో 85 టెస్టులు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. నిలకడగా ఆడలేకపోవడం అతడి సమస్యగా మారింది. దానిని అధిగమించాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్సీ సొంతం చేసుకునే అవకాశం రహానెకు ఉంది. రహానె ఒక్కసారి పరుగులు చేయడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా పరిస్థితులు అనుకూలిస్తాయి.
శతక్కొట్టిన కోహ్లీ.. రాణించిన అశ్విన్.. ప్రతిఘటిస్తున్న విండీస్
రహానెలోని కెప్టెన్సీని బీసీసీఐ సెలక్టర్లు గుర్తించాలి. ఆసీస్పై 36 పరుగులకు భారత్ ఆలౌట్ అయిన తర్వాత రహానె జట్టును నడిపించిన తీరు అభినందనీయం. అతడి ఫామ్పై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ నిలకడే సమస్య. దాని నుంచి బయటపడితే తప్పకుండా టెస్టు జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్గా రహానె రేసులో ఉంటాడు. ఒకవేళ అతడు పరుగులు చేయకపోతే జట్టులో నుంచే తప్పించే పరిస్థితీ రావచ్చు. ఐపీఎల్లో, డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టడంతో విండీస్తో సిరీస్కు వైస్ కెప్టెన్గా వచ్చాడు. ఇంకొంతకాలం ఆడే సత్తా రహానెలో ఉంది. నిలకడగా ఆడితే కెప్టెన్గానూ అవకాశం ఉంటుంది’’ అని జాఫర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!