ODI World Cup 2023: మికీ ఆర్థర్.. నీ పని అది కాదు.. అవన్నీ అనాలోచిత వ్యాఖ్యలు: పాక్ మాజీ కెప్టెన్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ వరల్డ్ కప్లో అంపైరింగ్పై స్పందిస్తూనే. తమ జట్టు కోచ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో భారత్ చేతిలో తమ జట్టు ఓడిపోవడంపై పాక్ మాజీలు ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఐసీసీ ఈవెంట్లో అంపైరింగ్పైనా కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ కోచ్ మికీ ఆర్థర్ చేసిన కామెంట్లను తప్పుబట్టిన మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. ఈ వరల్డ్ కప్లో అంపైరింగ్ సరిగా లేదని వ్యాఖ్యానించాడు. భారత్-పాక్ మ్యాచ్తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్లను ఉదాహరణగా పేర్కొన్నాడు.
‘‘ఐసీసీ ఈవెంట్లా కాకుండా బీసీసీఐ ఈవెంట్ వలె ఉందని పాక్ కోచ్ స్థానంలో ఉన్న మికీ ఆర్థర్ వ్యాఖ్యానించడం సరికాదు. అవి పూర్తిగా అనాలోచితమైనవి. అవి అతడి నియంత్రణలో ఉండవు. ఇలాంటి వాటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడి కర్తవ్యం ఆటగాళ్లలో స్ఫూర్తినింపడం. పరిస్థితులు ఎలా ఉన్నా జట్టును ఏకతాటిపై ముందుకు నడిపించాలి. అంతేగానీ, ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల జట్టుపై సానుకూల ప్రభావం పడదు. తర్వాతి మ్యాచుల్లో ఎలా ఆడాలనే విషయాలపైనే దృష్టి పెట్టాలి’’ అని సల్మాన్ హితవు పలికాడు.
ఇదేం అంపైరింగ్?
‘‘వరల్డ్ కప్లో అంపైరింగ్ ఆశించిన స్థాయిలో లేదు. తీసికట్టు నిర్ణయాలు వెలువడ్డాయి. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో ఔటు ఇచ్చిన విధానాలు వివాదాస్పదమయ్యాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారత్-పాక్ పోరులోనూ ఇలాంటి నిర్ణయాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా రిజ్వాన్ ఔట్ విషయంలో. కానీ, అతడు డీఆర్ఎస్ తీసుకోవడంతో బతికిపోయాడు. అందుకే, ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలు అంపైరింగ్లో లేవని అనిపిస్తోంది’’ అని సల్మాన్ భట్ తెలిపాడు.
ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాక్ మ్యాచ్ నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఫిర్యాదు చేసింది. ‘ ఆ రోజు మా జట్టును లక్ష్యంగా చేసుకుని అనుచితంగా ప్రవర్తించినట్లు అనిపించింది. ఆ రోజు మ్యాచ్లోనే కాకుండా.. పాక్ జర్నలిస్టులకు వీసాల మంజూరులోనూ జాప్యం, పాక్ అభిమానులకు వీసా విధానం లేకపోవడంపై ఐసీసీకి అధికారికంగా నిరసన తెలియజేసేలా ఫిర్యాదు చేశాం’’ అని పీసీబీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ఈ క్రమంలో సీనియర్ అధికారులతో పీసీబీ ఛైర్మన్ జకా అష్రాఫ్ సమావేశాలు నిర్వహించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్