WTC Final: రెండు నెలలు ఆడిన అనుభవం ఇదేనా..? పుజారాపై కనేరియా విమర్శలు
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో (WTC Final 2023) భారత్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్లో విఫలం కావడం. ఆదుకుంటాడని భావించిన ఛెతేశ్వర్ పుజారా తేలిపోయి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో ఇంగ్లాండ్లోనే ఆరు కౌంటీ మ్యాచ్లను ఆడిన ఛెతేశ్వర్ పుజారా.. మూడు సెంచరీల సాయంతో 545 పరుగులు సాధించాడు. మంచి ఫామ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బరిలోకి దిగాడు. తీరా కీలక మ్యాచ్లో 14, 27 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. భారీ లక్ష్య ఛేదనలో కుదురుకున్నట్లే కనిపించిన పుజారా అనవసరమైన అప్పర్ కట్ షాట్తో పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో పుజారా ఆటతీరుపై పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు గుప్పించాడు. రోజుల తరబడి ఉండి కూడా సరైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలం కావడం దారుణమని పేర్కొన్నాడు.
‘‘ఛెతేశ్వర్ పుజారా కౌంటీ క్రికెట్ ఆడాడు. రెండు నెలలపాటు ఇంగ్లాండ్ పరిస్థితులను అలవాటు చేసుకున్నాడు. అతడి అనుభవం మొత్తం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉపయోగించాల్సింది పోయి దారుణంగా విఫలం కావడం గమనార్హం. దీని వల్ల ఇంగ్లాండ్ డొమిస్టిక్ క్రికెట్లో బౌలింగ్ గొప్పగా ఏమీ లేదని తెలుస్తోంది. ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బంతులను సంధించడంతో వారిని అడ్డుకోవడంలో పుజారా విఫలమయ్యాడు. ఓవల్ పిచ్ పరిస్థితుల మాదిరిగానే ఉండే ఇతర మైదానాల్లో ఆడినప్పటికీ కీలక ఇన్నింగ్స్లు ఆడలేక చేతులెత్తేశాడు’’ అని డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.