లక్ష్య, సైనా శుభారంభం

ఇండోనేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అగ్రశ్రేణి క్రీడాకారులు లక్ష్యసేన్‌, సైనా నెహ్వాల్‌ శుభారంభం చేయగా.. కిదాంబి శ్రీకాంత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Published : 26 Jan 2023 02:08 IST

శ్రీకాంత్‌ పరాజయం
ఇండోనేసియా మాస్టర్స్‌

జకార్త: ఇండోనేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అగ్రశ్రేణి క్రీడాకారులు లక్ష్యసేన్‌, సైనా నెహ్వాల్‌ శుభారంభం చేయగా.. కిదాంబి శ్రీకాంత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఏడో సీడ్‌ లక్ష్య 21-12, 21-11తో కొడాయ్‌ నరవొక (జపాన్‌)పై విజయం సాధించాడు. శ్రీకాంత్‌ 10-21, 22-24తో షెసర్‌ హిరెన్‌ (ఇండోనేసియా) చేతిలో, ప్రియాంశు రజావత్‌ 21-18, 18-21, 18-21తో ఆరా వార్దోయో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సైనా 21-15, 17-21, 21-15తో యు పొ (చైనీస్‌ తైపీ)పై గెలుపొందింది. మాళవిక బాన్సోద్‌ 15-21, 13-21తో ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో జోడీ 21-10, 21-7తో హరిత- ఆష్నా జంటపై నెగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని