మనోడు ఎక్కడిదాకా?
ఆసియా కప్లో తలపడే భారత జట్టు ఎంపిక అనగానే.. గాయాల నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ పునరాగమనంపై ఎంత చర్చ జరిగిందో..
ఆసియా కప్లో తలపడే భారత జట్టు ఎంపిక అనగానే.. గాయాల నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ పునరాగమనంపై ఎంత చర్చ జరిగిందో.. అదే స్థాయిలో తిలక్ వర్మకు అవకాశం దక్కుతుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది. నెల ముందు వరకూ తిలక్ అంటే.. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపున వరుసగా రెండు సీజన్లలో మెరిసిన ఆటగాడు, దేశవాళీల్లో హైదరాబాద్ తరపున సత్తాచాటుతున్న కుర్రాడు మాత్రమే. కానీ ఇప్పుడు తిలక్ అంటే.. ప్రపంచ క్రికెట్లో ఓ మెరుపు. వెస్టిండీస్తో పొట్టి సిరీస్లో అరంగేట్రం చేసి.. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్ల్లో 57.66 సగటుతో 173 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్రేట్ 140.65గా ఉంది. ఈ సిరీస్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసింది అతనే. సాధించిన పరుగులను మించి అతని బ్యాటింగ్ తీరు ఎక్కువగా ఆకట్టుకుంది. క్రీజులో ఆత్మవిశ్వాసంతో కదులుతూ, అలవోకగా సిక్సర్లు కొడుతూ గొప్ప పరిణతి ప్రదర్శించాడు. దీంతో తిలక్ను ప్రపంచకప్లో ఆడించాలనే వాదన మొదలైంది. ఆ దిశగా ఈ నెల 30న ఆరంభమయ్యే ఆసియా కప్లో అతనికి చోటు దక్కింది. ఈ ఏడాది అక్టోబర్- నవంబర్లో భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా అదే ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహించనున్నారు. ఆసియా కప్తోనే ప్రపంచకప్లో ఆడే జట్టుపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో మన తిలక్ ప్రయాణం ఎక్కడి వరకూ సాగుతుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి ఆసియా కప్కు 17 మంది ఆటగాళ్లలో ఒకడిగా తిలక్ను ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో చోటు దక్కుతుందని మాత్రం కచ్చితంగా చెప్పలేం. కీలక ఆటగాళ్లైన శ్రేయస్, రాహుల్కు ప్రపంచకప్ ముందు మ్యాచ్ ప్రాక్టీస్ ఉండేలా చూడాలన్నది టీమ్ మేనేజ్మెంట్ ప్రయత్నం. శ్రేయస్ పూర్తిగా కోలుకున్నాడని చెబుతున్నారు. ఒకవేళ ఫిట్నెస్ పరంగా శ్రేయస్, రాహుల్ ఇబ్బంది పడ్డా, లయ అందుకోవడంలో తడబడ్డా అప్పుడు తిలక్కు అవకాశం రావొచ్చు. ఆసియా కప్లో తిలక్నూ పరీక్షించే అవకాశాలు లేకపోలేదు. కానీ శ్రేయస్, రాహుల్ జట్టులో ఉండగా.. చోటు దక్కుతుందా అన్నది ప్రశ్న. ఇప్పుడు ప్రపంచకప్లో తిలక్ స్థానం.. శ్రేయస్, రాహుల్ ఫిట్నెస్, ఫామ్పై ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి అడుగు ఎవరిదో
రెండు జట్లూ పరుగుల వరద పారించాయి. రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా (20 పాయింట్లు), రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ (17 పాయింట్లు) మధ్య మంగళవారమే క్వాలిఫయర్-1. -
ఇది కోహ్లి రాసిన కథ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. -
మన అమ్మాయి బంగారం
జపాన్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. మహిళల టీ20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. నాలుగో లేన్లో పరుగు మొదలుపెట్టిన తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడింది. -
దీప్తి.. విజయ స్ఫూర్తి
తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. -
జ్యోతి బృందానికి పసిడి
ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్లో భారత 4×400 మీటర్ల మిక్స్డ్ జట్టు అదరగొట్టింది. ‘లక్ష్య’ అథ్లెట్ జ్యోతికశ్రీ దండి, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, శుభ వెంకటేశన్లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది. -
మహి సరదాగా అలా
ఓటమి బాధను మర్చిపోవడానికి ఒక్కో ఆటగాడు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటాడు. వేర్వేరు వ్యాపకాల్లో పడిపోతుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని తనదైన శైల్లో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టాడు. -
సింధుకు పరీక్ష
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు మరో సవాల్కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించాలని భావిస్తున్న సింధు మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. -
ఆసియా ఆర్చరీకి గణేశ్
దక్షిణ కొరియాలోని సువాన్లో జరిగే 2024 ఆర్చరీ ఆసియా కప్ పోటీలకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం ఎంపికయ్యాడు. -
ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదు
భారత జట్టుకు ఆడాలనే కుర్రాళ్లకు ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్, కేకేఆర్ మార్గనిర్దేశకుడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్ తరపున ఎంతమంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు? -
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్ దయాల్ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చి తీవ్ర విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు. -
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.