Asia Cup 2023: ఆ కప్పై కన్ను.. ఈ కప్లో పోరు
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్పైనే అందరి దృష్టి! అక్టోబర్ 5న మొదలయ్యే ఆ విశ్వ సమరం షెడ్యూల్ వచ్చేసింది.
ఆసియా కప్ మరో రెండు రోజుల్లో
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్పైనే అందరి దృష్టి! అక్టోబర్ 5న మొదలయ్యే ఆ విశ్వ సమరం షెడ్యూల్ వచ్చేసింది. టికెట్ల విక్రయాలూ ఆరంభమయ్యాయి. పోటీపడే దేశాలు తమ జట్లనూ ప్రకటించేస్తున్నాయి. స్వదేశంలో ఇప్పటికే ప్రపంచకప్ సందడి షురూ అయింది. కానీ అంతకంటే ముందు.. మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి తెరలేవనుంది. ఆసియాలో ఛాంపియన్గా నిలిచేందుకు ఆరు దేశాలు పోటీపడనున్నాయి. అదే.. ఆసియా కప్. బుధవారమే దీనికి తెరలేవనుంది. ప్రపంచకప్కు సన్నాహకంగా ఈ టోర్నీని ఉపయోగించుకునేందుకు జట్లు సిద్ధమవుతున్నాయి.
ఈనాడు క్రీడా విభాగం
మరో రెండు రోజుల్లోనే ఆసియా కప్కు తెరలేవనుంది. ఇది 16వ ఆసియా కప్. 1984లో దీనికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల మధ్యలో ఒక్కోసారి అయిదు, నాలుగేళ్ల విరామం కూడా వచ్చింది. 2008 నుంచి మాత్రం ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. నిజానికి 2020లో శ్రీలంకలో, 2022లో పాకిస్థాన్లో ఈ టోర్నీ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా 2020లో జరగాల్సింది 2022లో యూఏఈకి మారడంతో.. 2022లో జరగాల్సింది 2023కి మారింది. మొదట కేవలం వన్డే ఫార్మాట్లోనే ఈ టోర్నీ నిర్వహించేవాళ్లు. కానీ 2016 నుంచి ఐసీసీ ప్రపంచకప్లను దృష్టిలో పెట్టుకుని టీ20, వన్డేల్లో మార్చిమార్చి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్ జరగబోతుంది. చివరగా 2018లో వన్డే ఫార్మాట్లో టోర్నీ జరిగింది.
భారత్దే ఆధిపత్యం
ఆసియా కప్లో టీమ్ఇండియాదే ఆధిపత్యం. ఏడు టైటిళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆరు సార్లు విజేతగా నిలిచిన శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ రెండు సార్లు కప్పు సొంతం చేసుకుంది. ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో పాటు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ టైటిల్ కోసం బరిలో దిగుతున్నాయి. ఆసియా కప్లో ఆడబోతుండటం నేపాల్కిదే తొలిసారి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
రెండు దేశాల్లో..
ఈ సారి ఆసియా కప్ మ్యాచ్లు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగనున్నాయి. మ్యాచ్లాడేందుకు పాక్ వెళ్లమని భారత్ స్పష్టం చేయడంతో ఈ టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో రెండు దేశాల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. అధికారిక ఆతిథ్య హోదాలో ఉండే పాక్లో 4 మ్యాచ్లు, శ్రీలంకలో భారత్ ఆడేవి సహా 9 మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్- ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్.. గ్రూప్- బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. మొదట ఒక్కో జట్టు గ్రూప్ దశలోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 ఆడతాయి. ఎలాగో గ్రూప్- ఎ నుంచి పాకిస్థాన్ (ఏ1), భారత్ (ఏ2), గ్రూప్- బి నుంచి శ్రీలంక (బి1), బంగ్లాదేశ్ (బి2) ముందంజ వేస్తాయనే ఉద్దేశంతో ఈ జట్లకు సీడింగ్ ఇచ్చారు. ఒకవేళ అఫ్గాన్ ముందంజ వేస్తే.. బంగ్లా, లంకలో నిష్క్రమించే ఒక జట్టును అది భర్తీ చేస్తుంది. సూపర్-4లో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో ఒక్క మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి.
అందరి కళ్లు
ఆసియా కప్ అనగానే అందరి కళ్లు భారత్, పాక్ పోరు మీదే ఉంటాయనడంలో సందేహం లేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్లు ఆడని సంగతి తెలిసిందే. అందుకే ఆసియా కప్, ప్రపంచకప్ వచ్చిందంటే ఈ దాయాది దేశాల మధ్య మ్యాచ్పైనే అమితాసక్తి ఉంటుంది. ఈ సారి ఆసియా కప్లో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడే అవకాశముంది. మొదట గ్రూప్ దశలో, ఆ తర్వాత సూపర్-4 దశలో ఆడటమైతే ఖాయమే! ఫైనల్ చేరితే మరోసారి తలపడతాయి. సెప్టెంబర్ 2న ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.
7
ఆసియా కప్లో అత్యధిక టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సాధించిన విజయాలు. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018లో భారత్ విజేతగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505