IND vs AFG: మహా సమరానికి ముందు మినీ పోరు
ఆస్ట్రేలియాతో ఆరంభ పోరులో కొంచెం కష్టపడ్డప్పటికీ.. విజయం మాత్రమే రోహిత్ సేనదే. ఎన్నో ఆశలతో, అంచనాలతో ప్రపంచకప్లో అడుగు పెట్టిన భారత జట్టుకు ఈ మ్యాచ్ ఒక పాఠమే.
నేడు అఫ్గాన్తో భారత్ ఢీ
గాడిన పడతారా?
మధ్యాహ్నం 2 నుంచి
దిల్లీ
ఆస్ట్రేలియాతో ఆరంభ పోరులో కొంచెం కష్టపడ్డప్పటికీ.. విజయం మాత్రమే రోహిత్ సేనదే. ఎన్నో ఆశలతో, అంచనాలతో ప్రపంచకప్లో అడుగు పెట్టిన భారత జట్టుకు ఈ మ్యాచ్ ఒక పాఠమే. దీని తర్వాత అందరి దృష్టీ నిలిచి ఉన్నది పాకిస్థాన్ పోరు మీదే. ప్రపంచకప్కే ఆకర్షణ కానున్న ఆ పోరుకు ముందు భారత్ చిన్న జట్టు అఫ్గానిస్థాన్తో తలపడబోతోంది. శనివారం జరిగే మహా పోరుకు ముందు టీమ్ఇండియాకిది ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిదనే చెప్పొచ్చు. బ్యాటర్లు, బౌలర్లు అందరూ గాడిన పడటానికి ఈ మ్యాచ్ మంచి అవకాశం.
ప్రపంచకప్ను విజయంతో ఆరంభించిన టీమ్ఇండియా.. తర్వాతి పోరుకు సిద్ధమైంది. బుధవారం రోహిత్ సేన.. అఫ్గానిస్థాన్ను ఢీకొనబోతోంది. తొలి మ్యాచ్లో నెగ్గినప్పటికీ టాప్ఆర్డర్ ఘోర వైఫల్యం భారత్ను కలవరపెట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్తో కీలక మ్యాచ్ నేపథ్యంలో బ్యాటర్లందరూ గాడిన పడటానికి అఫ్గానిస్థాన్ మ్యాచ్ను ఉపయోగించుకుంటారని జట్టు ఆశిస్తోంది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు పూర్తి అనుకూలం కాబట్టి మ్యాచ్లో పరుగుల వరద పారే అవకాశముంది.
ఆసీస్తో మ్యాచ్లో ఘోరమైన ప్రదర్శన చేసిన ముగ్గురు బ్యాటర్ల మీదే ఈ మ్యాచ్లో అందరి దృష్టీ నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లతో పాటు నాలుగో నంబర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఆ మ్యాచ్లో డకౌటయ్యారు. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఈ ముగ్గురూ అలా ఆడటం అభిమానులను నిరాశపరిచింది. డెంగీ జ్వరంతో బాధ పడుతున్న శుభ్మన్ ఈ మ్యాచ్కూ అందుబాటులో ఉండడు కాబట్టి ఇషానే రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అతను ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది. రోహిత్ ఈ మ్యాచ్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడి పాక్తో మ్యాచ్ ముంగిట లయ అందుకోవాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్లో సెంచరీ సాధించినప్పటికీ.. అసలు టోర్నీలోకి వచ్చేసరికి శ్రేయస్ పేలవంగా ఆడి వెనుదిరిగాడు. అతను కూడా ఫామ్ చాటాల్సి ఉంది. ఇక ఆసీస్పై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన రాహుల్, కోహ్లి ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. హార్దిక్, జడేజాలకు ఎక్కువసేపు ఆడే అవకాశం ప్రధాన బ్యాటర్లు ఇస్తారా అన్నది చూడాలి. బౌలింగ్లో స్పిన్నర్ల మీద ఎక్కువ అంచనాలున్నాయి. దిల్లీ పిచ్ వారికే అనుకూలం కాబట్టి జడేజా, కుల్దీప్ల నుంచి మరోసారి ఉత్తమ ప్రదర్శన ఆశించవచ్చు. పిచ్ను అనుసరించి మూడో స్పిన్నర్గా అశ్విన్ను ఆడించే అవకాశాలే ఎక్కువ. లేదంటే బుమ్రా, సిరాజ్లకు తోడుగా షమి, శార్దూల్ల్లో ఒకరిని ఎంచుకోవచ్చు.
కొంచెం జాగ్రత్తగా..
టీమ్ఇండియా ముందు.. అఫ్గానిస్థాన్ చిన్న జట్టే అయినా మరీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు స్టార్ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టగలరు. రషీద్ ఖాన్ సత్తా ఏంటో భారత ఆటగాళ్లకు తెలియంది కాదు. ఇంకా ముజీబ్, ఫారూఖీల రూపంలో ప్రమాదకర బౌలర్లున్నారు అఫ్గాన్కు. బ్యాటింగ్లో గుర్బాజ్ దూకుడుగా ఆడి బౌలర్ల లయను దెబ్బ తీయాలని చూస్తాడు. ఇబ్రహీం జాద్రాన్ ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు. నబి లాంటి నాణ్యమైన ఆల్రౌండర్ సేవలూ అఫ్గాన్కు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అఫ్గాన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే.
దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలం. ఈ ప్రపంచకప్లో ఇప్పటికే ఇక్కడ ఓ మ్యాచ్ జరగ్గా.. అందులో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులతో రికార్డు నెలకొల్పింది. తర్వాత శ్రీలంక కూడా 300 పైచిలుకు స్కోరు చేసింది. కాబట్టి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తే భారత్ నుంచి కూడా భారీ స్కోరు ఆశించవచ్చు. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకూ సహకరిస్తుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, కుల్దీప్, అశ్విన్/షమి, బుమ్రా, సిరాజ్.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్, హష్మతుల్లా (కెప్టెన్), రహ్మత్ షా, నజీబుల్లా జాద్రాన్, నబి, అజ్మతుల్లా, రషీద్, ముజీబ్, ఫారూఖీ, నవీనుల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి