టీ20 సిరీస్‌కు కోచ్‌ లక్ష్మణే

ఆస్ట్రేలియాతో అయిదు టీ20ల సిరీస్‌లో తలపడే భారత జట్టుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. అతను కోచ్‌గా కొనసాగేది లేనిది ఇంకా తేలలేదు.

Updated : 22 Nov 2023 13:51 IST

బెంగళూరు: ఆస్ట్రేలియాతో అయిదు టీ20ల సిరీస్‌లో తలపడే భారత జట్టుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. అతను కోచ్‌గా కొనసాగేది లేనిది ఇంకా తేలలేదు. గత రెండేళ్లలో ద్రవిడ్‌ అందుబాటులో లేని కొన్ని సిరీస్‌లకు లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్‌కు సైతం వీవీఎస్‌ బాధ్యతలు తీసుకున్నాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గురువారం విశాఖపట్నంలో జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని