India vs Afghanistan: సిరీస్ పట్టేయాలని
ఊహించినట్లుగానే తొలి టీ20లో అఫ్గానిస్థాన్ను చిత్తుచేసింది టీమ్ఇండియా. ఇప్పుడు రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ పట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు.
నేడు అఫ్గానిస్థాన్తో రెండో టీ20
కోహ్లీపైనే కళ్లన్నీ
రాత్రి 7 గంటల నుంచి
ఊహించినట్లుగానే తొలి టీ20లో అఫ్గానిస్థాన్ను చిత్తుచేసింది టీమ్ఇండియా. ఇప్పుడు రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ పట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కోహ్లి పునరాగమనం.. బ్యాటింగ్లో రోహిత్ మెరుపులను ఆదివారం జరిగే మ్యాచ్లో అభిమానులు చూడాలనుకుంటున్నారు. అందుకే ఈ మ్యాచ్పై ఆసక్తి రేకెత్తుతోంది. మరోవైపు సిరీస్ ఆశలు నిలవాలంటే అఫ్గాన్ శక్తికి మించి పోరాడాల్సిందే.
ఇందౌర్
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్కు ముందు టీమ్ఇండియా చివరిగా ఆడుతున్న పొట్టి సిరీస్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్పై కన్నేసిన టీమ్ఇండియా (India vs Afghanistan) ఆదివారం విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. ఈ రెండో మ్యాచ్లో గెలిచి మరో పోరు మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్, కోహ్లి ఈ సిరీస్కు ప్రత్యేక ఆకర్షణగా మారిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో రోహిత్ నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నా బ్యాటింగ్లో పరుగులు చేయలేకపోయాడు. ఇక ఆ మ్యాచ్కు దూరంగా ఉన్న కోహ్లి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు.
కలిసొచ్చిన జట్టుపై: 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్లో తొలి టీ20 ఆడేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు. తనకు అచ్చొచ్చిన అఫ్గాన్పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని విరాట్ చూస్తున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో అఫ్గాన్పైనే శతకంతో కోహ్లి సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే ప్రత్యర్థిపై రాణించి.. జట్టులో తన ఎంపిక సరైందేనని చాటాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే కోహ్లి రాకతో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్ను గొప్పగా ఆరంభించిన తిలక్ ఆ తర్వాత తడబడుతున్నాడు. గత 13 ఇన్నింగ్స్లో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. యశస్వి జైస్వాల్ ఫిట్నెస్ సాధిస్తే శుభ్మన్ కూడా బయటే ఉండాల్సి వస్తుంది.
దూబెపై దృష్టి: తొలి టీ20లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబెపై మరోసారి అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. హార్దిక్ గైర్హాజరీలో పేస్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్న దూబె నిలకడ కొనసాగించాల్సి ఉంది. ఇక గాయంతో వన్డే ప్రపంచకప్కు దూరమైన అక్షర్ పటేల్.. ఈ ఏడాది మాత్రం టీ20 ప్రపంచకప్లో ఆడాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. ఆ దిశగా ప్రతి మ్యాచ్ అతనికి కీలకమే. తొలి టీ20లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లతో రాణించిన అక్షర్ ఈ మ్యాచ్లోనూ ఫామ్ కొనసాగించాల్సి ఉంది. గత మ్యాచ్లో సుందర్్ వికెట్ల వేటలో విఫలమయ్యాడు. 3 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక్క వికెట్టూ తీయలేకపోయిన అతని మరో అవకాశం వస్తుందని కచ్చితంగా చెప్పలేం. అతని స్థానంలో కుల్దీప్ను ఆడించే ఆస్కారముంది. మరోవైపు యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా 11కు పైగా ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. తన సొంత మైదానంలో అవేశ్ను ఆడించాలని అనుకుంటే బిష్ణోయ్ను డగౌట్కే పరిమితం చేయొచ్చు. భారత ఫీల్డింగ్ మాత్రం మరింత మెరుగుపడాల్సి ఉంది.
పుంజుకోవాలని: తొలి టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేసిన అఫ్గానిస్థాన్ మ్యాచ్ సాంతం తీవ్రత కొనసాగించలేకపోయింది. మంచి ఆరంభం దక్కినా.. మధ్యలో నబి చెలరేగినా భారీ స్కోరు సాధించలేకపోయింది.ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో మరింత మెరుగ్గా రాణించి, పుంజుకోవాలని ఆ జట్టు చూస్తోంది.
తుది జట్లు (అంచనా)... భారత్: రోహిత్, శుభ్మన్/యశస్వి, కోహ్లి, శివమ్ దూబె, జితేశ్, రింకు సింగ్, అక్షర్, సుందర్/కుల్దీప్, రవి బిష్ణోయ్/అవేశ్, అర్ష్దీప్, ముకేశ్.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబి, గుల్బాదిన్ నయీబ్, కరీం జనాత్, ఫజల్ ఫరూఖీ, నవీనుల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.
పరుగులే పరుగులు
ఇందౌర్లోని హోల్కర్ స్టేడియంను బ్యాటింగ్ స్వర్గధామం అని చెప్పొచ్చు. ఫ్లాట్గా ఉండే వికెట్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 210గా ఉండటం విశేషం. ఇక్కడ మూడు టీ20లు ఆడిన భారత్ రెండు గెలిచి, ఒకటి ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు రెండు సార్లు నెగ్గగా, ఛేదన జట్టు ఓ సారి విజయం సొంతం చేసుకుంది. మంచు ప్రభావం దృష్ట్యా టాస్ గెలిస్తే ఛేదనకే మొగ్గు చూపే ఆస్కారముంది.
40
స్వదేశంలో 12 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన అయిదో ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లికి కావాల్సిన పరుగులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?