నెట్స్‌లో పంత్‌

రిషబ్‌ పంత్‌ ఫిట్‌నెస్‌ మెరుగుపడుతుందనడానికి ఇంకో సూచిక. మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో నెట్స్‌లో అతడు 20 నిమిషాలు సాధన చేశాడు. ఎన్‌సీఏ సిబ్బంది నుంచి అతడు త్రోలు  ఎదుర్కొన్నాడు.

Published : 17 Jan 2024 02:47 IST

రిషబ్‌ పంత్‌ ఫిట్‌నెస్‌ మెరుగుపడుతుందనడానికి ఇంకో సూచిక. మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో నెట్స్‌లో అతడు 20 నిమిషాలు సాధన చేశాడు. ఎన్‌సీఏ సిబ్బంది నుంచి అతడు త్రోలు  ఎదుర్కొన్నాడు. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు రావడానికి ముందు పంత్‌ నెట్స్‌లో గడిపాడు. ఆ తర్వాత కోహ్లి సహా ఆటగాళ్లను కలిశాడు. 2022లో కారు ప్రమాదంతో పంత్‌ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు వేగంగా కోలుకుంటున్నాడు. 2024 ఐపీఎల్‌లో పంత్‌ ఆడతాడని భావిస్తున్నారు. ఇప్పటికే అతణ్ని దిల్లీ కెప్టెన్‌గా ప్రకటించారు. పంత్‌ చివరిసారి 2022లో (బంగ్లాదేశ్‌తో టెస్టు) భారత జట్టు తరఫున ఆడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని