మే 26న చెన్నైలో ఐపీఎల్‌ ఫైనల్‌

ఐపీఎల్‌-17 పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. మే 26న జరిగే ఫైనల్‌కు చెన్నై వేదికగా నిలవనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కావడంతో..

Published : 26 Mar 2024 03:41 IST

దిల్లీ: ఐపీఎల్‌-17 పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. మే 26న జరిగే ఫైనల్‌కు చెన్నై వేదికగా నిలవనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కావడంతో.. చెన్నైని ఫైనల్‌ వేదికగా ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలుత 21 మ్యాచ్‌ల వేదికలను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ.. ఎన్నికల తేదీలు ఖరారవడంతో రెండో విడత షెడ్యూల్‌ (53 మ్యాచ్‌లు)ను విడుదల చేసింది. మే 21, 22 తేదీల్లో క్వాలిఫయర్‌-1, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌ వేదిక. క్వాలిఫయర్‌-2 చెన్నైలో జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని