Sachin : ఆ నిర్ణయం నాకు విస్మయాన్ని కలిగించింది.. WTC Final ఓటమిపై సచిన్
WTC Finala టీమ్ఇండియా ఘోర ఓటమిపై క్రికెట్ దిగ్గజం సచిన్(Sachin Tendulkar) స్పందించాడు. జట్టు ఎంపిక తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్డెస్క్: రెండేళ్లు కష్టపడి చివరిదాకా వచ్చి.. WTC Finalలో టీమ్ఇండియా(Team India) చేతులెత్తేసింది. కీలక టెస్టు మహాసమరం(WTC Final)లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో రోహిత్ సేన ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భారత జట్టులో లోటుపాట్లను ఎత్తిచూపుతున్నారు. ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) కూడా జట్టు సెలక్షన్, ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
భారత ప్లేయింగ్ XIలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (Ravichandran Ashwin)ను తీసుకోకపోవడంపై సచిన్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘పోటీలో ఉండాలంటే భారత్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. భారత్ వైపు కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ.. ప్రపంచంలోనే నంబర్ వన్ టెస్టు బౌలర్గా కొనసాగుతున్న అశ్విన్ను ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు’ అని సచిన్ పేర్కొన్నాడు.
సీమర్లకు సహకరించే పిచ్ అని చెప్పి అశ్విన్ నైపుణ్యాలను ఉపయోగించుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సచిన్ అన్నాడు. ‘నేను గతంలో చెప్పినట్లుగానే.. నైపుణ్యం ఉన్న స్పిన్నర్లు ఎప్పుడూ టర్నింగ్ ట్రాక్లపైనే ఆధారపడరు. వారు పరిస్థితులను ఉపయోగించుకుని బంతుల్లో వైవిధ్యాన్ని చూపుతారు. ఆసీస్ టాప్ 8 బ్యాటర్లలో ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లన్న విషయాన్ని మరవకూడదు’ అని సచిన్ వివరించాడు.
ఇక అశ్విన్ ఈ రెండేళ్ల డబ్ల్యూటీసీ సైకిల్లో 13 టెస్టుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. అయితే అశ్విన్ను తీసుకోకపోవడాన్ని కోచ్ ద్రవిడ్ సమర్థించుకున్నాడు. మేఘావృతమైన పరిస్థితుల కారణంగానే తాము నాల్గో స్పెషలిస్ట్ సీమర్తో బరిలోకి దిగాల్సి వచ్చిందని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.