IPL - 2022 : భారత జట్టు బలమైన నాయకుడి కోసం ఎదురు చూస్తోంది : రవిశాస్త్రి
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022 సీజన్లో.. టీమ్ఇండియా పగ్గాలు చేపట్టబోయే నాయకుడు ఎవరో తేలిపోనుందని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గొప్పగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు...
ఇంటర్నెట్ డెస్క్ : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022 సీజన్లో.. టీమ్ఇండియా పగ్గాలు చేపట్టబోయే నాయకుడు ఎవరో తేలిపోనుందని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గొప్పగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. అయితే, రోహిత్ తర్వాత బాధ్యతలు చేపట్టబోయే బలమైన నాయకుడి కోసం టీమ్ఇండియా వేచి చూస్తోందని రవిశాస్త్రి అన్నాడు.
‘టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ గొప్పగా జట్టును నడిపిస్తున్నాడు. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ తనదైన ముద్ర వేశాడు. అయితే, హిట్మ్యాన్ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టేదెవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టు బలమైన నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. యువ ఆటగాళ్లకు ఇదే గొప్ప అవకాశం. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్లోనే టీమ్ఇండియా భవిష్యత్ నాయకుడు ఎవరో తేలిపోనుంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి యువ ఆటగాళ్లు నాయకత్వ పోటీలో ముందంజలో ఉన్నారు’ అని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పాడు.
‘మరోవైపు, త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో అందరి దృష్టి హార్దిక్ పాండ్యపైనే ఉంది. వెన్నెముక గాయం నుంచి కోలుకున్న హార్దిక్ ఈ సీజన్లోనైనా బౌలింగ్ చేస్తాడా.? మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకుంటాడా.? అని ఎదురు చూస్తున్నారు. అతడి లాగే ఎంతో మంది ఆటగాళ్లు భారత జట్టులో చోటు కోసం వేచి చూస్తున్నారు. ఈ సీజన్ నుంచి మరో రెండు జట్లు కొత్తగా ఐపీఎల్లోకి అడుగుపెడుతుండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. యువ ఆటగాళ్లు ఐపీఎల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జట్టులో తమ స్థానాలను పదిలం చేసుకోవాలి. ఐపీఎల్ కారణంగానే ఎంతో మంది నాణ్యమైన యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. గత సీజన్లో వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటారు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM