T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024.. భారత్Xపాక్ మ్యాచ్ డేట్ అదేనా?
దాయాదుల పోరు చూసేందుకు అభిమానులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. భారత్ - పాక్ (IND vs PAK) ఫ్యాన్స్ను ఖుషీ చేయడానికి మరోసారి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) రూపంలో అవకాశం రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: మరో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) సందడి మొదలుకానుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ పొట్టి కప్లో దాదాపు 20 జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, అందరి దృష్టి మరోసారి దాయాదుల పోరుపై ఉండటం సహజమే. ఇంకా అధికారికంగా షెడ్యూల్ ఖరారు కాలేదు. కానీ, క్రికెట్ వర్గాల ప్రకారం భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్ల మధ్య జూన్ 9న మ్యాచ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్లో టీమ్ఇండియా మ్యాచ్లు జూన్ 5 ప్రారంభమవుతాయి. మిగతా నాలుగు జట్లతో యూఎస్ఏ వేదికగానే భారత్ మ్యాచ్లు ఆడనుంది.
ఒకవేళ టీమ్ఇండియా (Team India) సూపర్ 8 దశకు చేరుకున్నాక.. జూన్ 20 నుంచి మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో మాత్రం టీమ్ఇండియా మ్యాచ్లు వెస్టిండీస్లోనే జరుగుతాయని సమాచారం. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా జరగనుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. పొట్టి కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడతారనే ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, దాదాపు సంవత్సరం నుంచి వీరిద్దరూ టీ20ల్లో పాల్గొనలేదు. ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా టీమ్ఇండియా ఎంపిక ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
టీ20 వరల్డ్ కప్లో భారత్ మ్యాచ్లు ఇలా (అంచనా)
- ఐర్లాండ్తో న్యూయార్క్ వేదికగా జూన్ 5న
- పాకిస్థాన్తో న్యూయార్క్ వేదికగా జూన్ 9న
- యూఎస్ఏతో న్యూయార్క్ వేదికగా జూన్ 12న
- కెనడాతో ఫ్లోరిడా వేదికగా జూన్ 15న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం