IND vs ENG : ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. భారత్‌ ముందు 231 పరుగుల లక్ష్యం..

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో.. ఇంగ్లాండ్‌ 420 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

Updated : 28 Jan 2024 11:52 IST

హైదరాబాద్‌ :  భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs ENG) నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ 420 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో 231 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ముందు ఉంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్‌ ఒలీపోప్‌ (196) అద్భుతంగా పోరాడాడు. త్రుటిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. డకెట్‌ (47), బెన్‌ ఫోక్స్‌ (34), హార్ట్‌లీ (34), క్రాలీ (31) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్‌ 3, జడేజా 2, అక్షర్‌ 1 వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లాండ్‌ 246, భారత్‌ 436 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని