IND vs PAK: మెగా పోరు మజానే వేరు!
రేడియోల కాలంలో అభిమానులు ఆ మ్యాచ్ వస్తే చెవులు రిక్కించి వినేవాళ్లు.. టీవీల్లో బొమ్మ సరిగా రాకపోతే యాంటెనాతో కుస్తీపట్టేవాళ్లు.. కరెంటు పోతే తిట్టుకునేవాళ్లు!
ఈనాడు క్రీడావిభాగం
రేడియోల కాలంలో అభిమానులు ఆ మ్యాచ్ వస్తే చెవులు రిక్కించి వినేవాళ్లు.. టీవీల్లో బొమ్మ సరిగా రాకపోతే యాంటెనాతో కుస్తీపట్టేవాళ్లు.. కరెంటు పోతే తిట్టుకునేవాళ్లు! పాఠశాలకెళ్లే పిల్లల నుంచి.. కళాశాలకు వెళ్లే యువత వరకు.. ఆఫీసులకెళ్లే అంకుల్స్ నుంచి ఇంట్లో ఉండే పెద్దోళ్ల వరకు అందరికి ఒకటే టెన్షన్! ఆ రోజు ఎవరు గెలుస్తారో అని! మరి జరిగేది మామూలు మ్యాచ్ కాదు. ఓ మహా సమరం! మైదానంలో అతి పెద్ద యుద్ధం! అదే భారత్-పాకిస్థాన్ పోరు! కాలం ఎంత గతించినా.. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేకపోయినా.. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు తలపడుతుంటే అభిమానుల హృదయాలు క్రికెట్.. క్రికెట్ అంటూ కొట్టుకుంటాయి. అలాంటి వాతావరణం మళ్లీ వచ్చేసింది. వన్డే ప్రపంచకప్లో శనివారం భారత్-పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనగానే అభిమానులు ఎంత ఉద్వేగానికి గురవుతారో.. ఆటగాళ్లు రెండింతలు ఒత్తిడికి లోనవుతారు. అలాంటిది ప్రపంచకప్ అంటే ఈ వేడి తీవ్ర స్థాయిలో ఉంటుంది. గతంలో మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటామాటా పెరిగిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. 1992 ప్రపంచకప్లో వికెట్కీపర్ కిరణ్ మోరెను చూసి బ్యాటర్ మియాందాద్ కుప్పిగంతులు వేయడం అందులో మొదటిది. పదే పదే అప్పీలు చేస్తున్న మోరెను అనుకరిస్తూ మియాందాద్ కుప్పిగంతులు వేసి రెచ్చగొట్టాడు. అయినా ఈ మ్యాచ్లో చివరికి భారత్దే పైచేయి అయింది. 1996 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో పేసర్ వెంకటేశ్ ప్రసాద్-అమీర్ సోహైల్ వివాదం మరో ఎత్తు. ప్రసాద్ బౌలింగ్లో ఫోర్ కొట్టి బ్యాట్ను బౌండరీ వైపు చూపిస్తూ సోహైల్ హేళన చేయడం.. ఆ వెంటనే ప్రసాద్ అతడిని బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకోవడం అప్పుడో సంచలనం. ఇలాంటివి అభిమానుల మనసులో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయేవే. రెండు జట్ల మధ్య మ్యాచ్ తీవ్రతకు అద్ధం పట్టే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. 2003 ప్రపంచకప్లో తనను కవ్వించిన షోయబ్ అక్తర్కు సచిన్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. మైదానంలో క్రికెటర్లే కాదు.. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసే అభిమానుల భావోద్వేగాలు కూడా తీవ్ర స్థాయిలో సాగుతుంటాయి ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతుంటే. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మెగా టోర్నీలో ఏడు మ్యాచ్లు జరగగా.. దేనికదే ప్రత్యేకమైంది. ప్రపంచకప్లో పాక్పై 2003, 2011లో సచిన్ వీరోచిత ఇన్నింగ్స్.. 2015లో కోహ్లి, 2019లో రోహిత్ సెంచరీలు కూడా అభిమానుల మదిలో ఎప్పుడూ నిలిచిపోయేవే.
ఆ వేడి తగ్గింది కానీ..
కాలం మారింది.. క్రికెట్ ఆడే తీరు మారింది.. ఒకప్పటితో పోలిస్తే భారత్-పాక్ మ్యాచ్లంటే ఉండే ఉద్విగ్న వాతావరణంలోనూ కాస్త మార్పు వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్పై అభిమానుల్లో ఉండే ఆసక్తిలో ఎలాంటి మార్పు లేకపోయినా.. మైదానంలో అప్పటిలా ఉద్రిక్త వాతావరణమైతే ఉండట్లేదు. ఆటగాళ్లు స్నేహపూర్వకంగా ఉంటున్నారు. రెండు జట్లు ఎక్కువ మ్యాచ్లు ఆడకపోవడమే కారణమేమో. భారత్, పాక్ మధ్య అసలు ద్వైపాక్షిక సిరీస్లే ఉండట్లేదు. తలపడేది ఐసీసీ టోర్నమెంట్లలోనే. పాక్ ఏడేళ్ల తర్వాత.. ఇప్పుడు ప్రపంచకప్ కోసం అడుగుపెట్టింది. ఆటగాళ్ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం లేకపోయినా.. మైదానంలో ఆట తీవ్రతలో తేడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడితే ఏం జరుగుతుందో రెండు జట్ల ఆటగాళ్లకు బాగా తెలుసు. ఎన్ని విమర్శలు, ఎంతో ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్నే ప్రశ్నార్థకం చేసే మ్యాచ్ ఇది. కోట్లాది మంది అభిమానులు తమపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టేందుకు రెండు జట్ల ఆటగాళ్లు ప్రాణంపెట్టి మైదానంలో పోటీపడతారు.
ఒత్తిడి పాక్పైనే
భారత్-పాక్ మధ్య ఇప్పటివరకు ఎన్నో ఉత్కంఠభరిత సమరాలు జరిగాయి. ప్రపంచకప్లో మాత్రం ఆధిపత్యం భారత్దే. వన్డే ప్రపంచకప్లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరిగితే అన్నింట్లో టీమ్ఇండియాదే విజయం. టీ20 ప్రపంచకప్లోనూ పాక్పై భారత్కు తిరుగేలేదు. అందులో పాక్తో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒక్కటే ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. మొత్తంమీద వన్డేల్లో పాక్ ముందంజలో ఉంది. 134 వన్డేల్లో పాక్ 73.. భారత్ 56 నెగ్గాయి. అయిదింట్లో ఫలితం తేలలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.