రాహుల్ అండ.. గేల్ ప్రోత్సాహం.. కుంబ్లే ఓదార్పు
కోల్కతాపై చేసిన అజేయ అర్ధశతకం తనకెంతో ప్రత్యేకమని పంజాబ్ ఓపెనర్ మన్దీప్ సింగ్ అన్నాడు. తాను లయ అందుకొనేందుకు, స్వేచ్ఛగా ఆడేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎంతో అండగా నిలిచాడని పేర్కొన్నాడు....
అందువల్లే స్వేచ్ఛగా ఆడలిగానన్న మన్దీప్
(తల్లితో మన్దీప్)
షార్జా: కోల్కతాపై చేసిన అజేయ అర్ధశతకం తనకెంతో ప్రత్యేకమని పంజాబ్ ఓపెనర్ మన్దీప్ సింగ్ అన్నాడు. తాను లయ అందుకొనేందుకు, స్వేచ్ఛగా ఆడేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎంతో అండగా నిలిచాడని పేర్కొన్నాడు. మ్యాచులో ఎన్ని పరుగులు చేసినా నాటౌట్గా నిలవాలనే తన తండ్రి కోరుకొనేవారని వెల్లడించాడు. అర్ధశతకం అందుకోగానే మన్దీప్ భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.
కోల్కతా మ్యాచులో మన్దీప్ 56 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. పంజాబ్ వరుసగా ఐదో విజయం సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు శనివారం దుబాయ్ వేదికగా హైదరాబాద్తో పంజాబ్ తలపడింది. అదే రోజు మన్దీప్ తండ్రి భారత్లో కన్నుమూశారు. బయో బుడగ, క్వారంటైన్ ఇబ్బందులతో అతడు స్వదేశానికి వెళ్లలేకపోయాడు. వీడియోకాల్ ద్వారా తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. గుండె దిటవు చేసుకొని హైదరాబాద్ మ్యాచులో 17 పరుగులు చేశాడు.
మోర్గాన్ సేనపై అర్ధశతకం చేయగానే మన్దీప్ భావోద్వేగానికి గురయ్యాడు. బ్యాటును, పిడికిలిని ఆకాశం వైపు చూపిస్తూ తండ్రికి నివాళి అర్పించాడు. ఆ సమయంలో అతడి కళ్లలో నీటిచెమ్మ కనిపించింది. దాంతో మరో ఎండ్లో ఉన్న క్రిస్గేల్ సైతం మన్దీప్ తండ్రికి నివాళి అర్పించి అతడిని ఓదార్చాడు. టైమ్ఔట్ రాగానే కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ రాహుల్, మరికొందరు ఆటగాళ్లు అతడి వద్దకు వచ్చి ప్రత్యేకంగా అభినందించారు. గుండెకు హత్తుకొని ఓదార్చారు. మ్యాచ్ ముగిశాక కోల్కతా ఆటగాళ్లు సైతం అతడిని పరామర్శించారు.
‘ఇదెంతో ప్రత్యేకమైన ఇన్నింగ్స్. ప్రతి మ్యాచులో అజేయంగా నిలవాలని మా నాన్నెప్పుడూ చెబుతుండే వారు. అందుకే ఇదెంతో ప్రత్యేకం. మ్యాచులో 100, 200 చేసినా నాటౌట్గా నిలవాలనే చెప్తుండేవారు. మ్యాచ్కు ముందు నేను రాహుల్తో మాట్లాడాను. గత మ్యాచులో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాను. కానీ ఎందుకో సౌకర్యంగా అనిపించలేదు. అందుకే నేను నా శైలిలో కుదురుగా ఆడి మ్యాచును గెలిపిస్తానని, నాపై నమ్మకం ఉంచాలని అడిగాను. అందుకు రాహుల్ అంగీకరించాడు. నా సహజ శైలిలో ఆడేందుకు అండగా నిలిచాడు. గేల్ సైతం నేను చివరి వరకు ఆడేందుకు ప్రోత్సహించాడు. నువ్వెప్పుడూ రిటైర్ అవ్వొద్దని నేను బదులిచ్చాను. అతనెంతో బాగా ఆడాడు’ అని మన్దీప్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.