IPL 2021: కోల్కతా ఫైనల్కి.. దిల్లీ ఇంటికి..
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో క్వాలిఫైయర్-2 మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్ చెమటోడ్చి నెగ్గింది. దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో
ఇంటర్నెట్ డెస్క్: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చెమటోడ్చి నెగ్గింది. దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో కోల్కతా ఫైనల్కి చేరింది. ఓటమి పాలైన దిల్లీ లీగ్ నుంచి నిష్క్రమించింది. కోల్కతా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (55: 41 బంతుల్లో 4x4, 3x6) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (46: 46 బంతుల్లో 1x4, 1x6) రాణించాడు. దిల్లీ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే తలో రెండు వికెట్లు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
దిల్లీ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ 12 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. వెంకటేశ్ అయ్యర్ అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత.. రబాడ వేసిన 13వ ఓవర్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నోర్జే వేసిన 16వ ఓవర్లో హెట్మైర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా పంత్కి చిక్కాడు. స్వల్ప వ్యవధిలోనే దినేశ్ కార్తిక్ (0), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0) బౌల్డయ్యారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో.. క్రీజులో ఉన్న షకిబ్ అల్ హసన్ (0), సునీల్ నరైన్ (0) ఔట్ చేశాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులుకు మారింది. అయితే, 19.5 బంతిని రాహుల్ త్రిపాఠి (12) సిక్సర్గా మలచడంతో కోల్కతా విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్తో టైటిల్ పోరులో తలపడనుంది.
అంతకు ముందు, టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దిల్లీ క్యాపిటల్స్.. కోల్కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (36) టాప్ స్కోరర్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (30*) పరుగులతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా (18) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్ (18).. మరో ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శివమ్ మావి వేసిన 12వ ఓవర్లో బౌల్డై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ధావన్ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో షకిబ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (6) విఫలమయ్యాడు. ఆఖర్లో వచ్చిన షిమ్రోన్ హెట్మైర్ (17) దూకుడుగా ఆడాడు. అక్షర్ పటేల్ (4) పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడాలనే సూత్రాన్ని పక్కన పెట్టడంతో ఇషాన్, శ్రేయస్పై వేటుపడిన సంగతి తెలిసిందే. -
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో... -
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా ప్రత్యేక ఆకర్షణ ఎంఎస్ ధోనీ. రెండు మ్యాచుల్లో మినహా ప్రతిసారీ అతడి బ్యాట్ నుంచి బౌండరీల వర్షం కురిసింది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్లను చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. -
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
కీలకమైన ఆటగాళ్ల క్యాచ్లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు క్యాచ్లను చేజార్చారు. -
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది. -
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి