IPL: విరాట్ కోహ్లీతో సమానంగా నిలిచిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఫ్రాంచైజీలు లఖ్నవూ, అహ్మదాబాద్ జట్ల ముగ్గురేసి..
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఫ్రాంచైజీలు లఖ్నవూ, అహ్మదాబాద్ జట్ల ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ను తీసుకోగా.. లఖ్నవూ టీమ్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయిని ఎంచుకుంది. లఖ్నవూకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్కు హార్దిక్ పాండ్య సారథులుగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి రెండో వారంలో మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ తెలిపింది. మొత్తం 1,214 మంది ఆటగాళ్లు మెగా వేలంలోకి వస్తున్నారు.
ఈ క్రమంలో కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో కోహ్లీ సరసన చేరాడు. 2018లో వేలానికి ముందే కోహ్లీని ఆర్సీబీ రూ.17 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేఎల్ రాహుల్కు కూడా అంతే మొత్తాన్ని ఇచ్చి లఖ్నవూ సెలెక్ట్ చేసుకుంది. స్టోయినిస్ రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4 కోట్లు అందుకుంటారు. లఖ్నవూ ఫ్రాంచైజీ రూ.59.89 కోట్లతో మెగా వేలంలోకి వచ్చి ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది.
అహ్మదాబాద్ సారథిగా ఎంపికైన హార్దిక్ పాండ్యకు రూ.15 కోట్లు దక్కనుండగా.. రషీద్ ఖాన్కు కూడానూ రూ.15 కోట్లు ఇస్తుండటం విశేషం. ఇక శుభ్మన్ గిల్ రూ.8 కోట్లు అందుకోనున్నాడు. దీంతో మిగతా ఆటగాళ్ల కోసం వేలంలో అహ్మదాబాద్ రూ.52 కోట్లను వెచ్చించనుంది. కెప్టెన్గా హార్దిక్ పాండ్య జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపుతాడని ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్స్టెన్ తెలిపాడు. సారథిగా అనుభవం లేకపోయినా రాణిస్తాడనే నమ్మకం మాత్రం తమకుందని పేర్కొన్నాడు. హార్దిక్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
ఈ సారి వీరు లేరు..
ఐపీఎల్ మెగా వేలం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే టాప్ ప్లేయర్లు అయిన కొంతమంది ఆటగాళ్లు మెగా వేలంలోకి రాకపోవడం అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురి చేసేదే. అందులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, సామ్ కరన్ వంటి ఆటగాళ్లు ఈసారి రిజిస్టర్ చేసుకోలేదు. ఇంగ్లాండ్ తరఫున స్వదేశంలో జరిగే సిరీస్ల కోసం ఐపీఎల్ మెగా వేలంలోకి బెన్ స్టోక్స్ రావడం లేదని తెలుస్తోంది. ఇదే విధంగా జో రూట్ కూడా మొదట్లో ఆసక్తి కనబరిచినా ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ కోసం తన పేరు నమోదు చేసుకోలేదు.
బరిలో నిలిచిన టాప్ ప్లేయర్లు
డేవిడ్ వార్నర్, రవిచంద్రన్ అశ్విన్, డ్వేన్ బ్రావో, మిచెల్ మార్ష్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా, ప్యాట్ కమిన్స్, షకిబ్ అల్ హసన్, ట్రెంట్ బౌల్ట్, స్టీవ్ స్మిత్, డికాక్, రబాడ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు సహా 49 మంది బేసిక్ ధర రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు. భారత ఆల్రౌండర్ షారుక్ ఖాన్ రూ.20 లక్షలతో బేసిక్ ధరతో ఉన్నా వేలంలో భారీ మొత్తం దక్కుతుందని ఆశిస్తున్నాడు. టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ బేసిక్ ధర రూ.50 లక్షల కేటగిరీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. నిషేధం పూర్తి చేసుకుని మైదానంలోకి దిగేందుకు ఎదురు చూస్తున్నానని ఇప్పటికే పలుమార్లు శ్రీశాంత్ చెప్పాడు.
* బేసిక్ రూ. 1.5 కోట్లు: అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ఆరోన్ ఫించ్, ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్, టిమ్ సౌథీ, జేమ్స్ నీషమ్
* బేసిక్ ధర రూ. కోటి: అజింక్య రహానె, కుల్దీప్ యాదవ్, నటరాజన్, హసరంగ, మార్క్రమ్, షంసి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్