IPL: విరాట్ కోహ్లీతో సమానంగా నిలిచిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఫ్రాంచైజీలు లఖ్నవూ, అహ్మదాబాద్ జట్ల ముగ్గురేసి..
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఫ్రాంచైజీలు లఖ్నవూ, అహ్మదాబాద్ జట్ల ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ను తీసుకోగా.. లఖ్నవూ టీమ్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయిని ఎంచుకుంది. లఖ్నవూకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్కు హార్దిక్ పాండ్య సారథులుగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి రెండో వారంలో మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ తెలిపింది. మొత్తం 1,214 మంది ఆటగాళ్లు మెగా వేలంలోకి వస్తున్నారు.
ఈ క్రమంలో కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో కోహ్లీ సరసన చేరాడు. 2018లో వేలానికి ముందే కోహ్లీని ఆర్సీబీ రూ.17 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేఎల్ రాహుల్కు కూడా అంతే మొత్తాన్ని ఇచ్చి లఖ్నవూ సెలెక్ట్ చేసుకుంది. స్టోయినిస్ రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4 కోట్లు అందుకుంటారు. లఖ్నవూ ఫ్రాంచైజీ రూ.59.89 కోట్లతో మెగా వేలంలోకి వచ్చి ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది.
అహ్మదాబాద్ సారథిగా ఎంపికైన హార్దిక్ పాండ్యకు రూ.15 కోట్లు దక్కనుండగా.. రషీద్ ఖాన్కు కూడానూ రూ.15 కోట్లు ఇస్తుండటం విశేషం. ఇక శుభ్మన్ గిల్ రూ.8 కోట్లు అందుకోనున్నాడు. దీంతో మిగతా ఆటగాళ్ల కోసం వేలంలో అహ్మదాబాద్ రూ.52 కోట్లను వెచ్చించనుంది. కెప్టెన్గా హార్దిక్ పాండ్య జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపుతాడని ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్స్టెన్ తెలిపాడు. సారథిగా అనుభవం లేకపోయినా రాణిస్తాడనే నమ్మకం మాత్రం తమకుందని పేర్కొన్నాడు. హార్దిక్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
ఈ సారి వీరు లేరు..
ఐపీఎల్ మెగా వేలం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే టాప్ ప్లేయర్లు అయిన కొంతమంది ఆటగాళ్లు మెగా వేలంలోకి రాకపోవడం అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురి చేసేదే. అందులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, సామ్ కరన్ వంటి ఆటగాళ్లు ఈసారి రిజిస్టర్ చేసుకోలేదు. ఇంగ్లాండ్ తరఫున స్వదేశంలో జరిగే సిరీస్ల కోసం ఐపీఎల్ మెగా వేలంలోకి బెన్ స్టోక్స్ రావడం లేదని తెలుస్తోంది. ఇదే విధంగా జో రూట్ కూడా మొదట్లో ఆసక్తి కనబరిచినా ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ కోసం తన పేరు నమోదు చేసుకోలేదు.
బరిలో నిలిచిన టాప్ ప్లేయర్లు
డేవిడ్ వార్నర్, రవిచంద్రన్ అశ్విన్, డ్వేన్ బ్రావో, మిచెల్ మార్ష్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా, ప్యాట్ కమిన్స్, షకిబ్ అల్ హసన్, ట్రెంట్ బౌల్ట్, స్టీవ్ స్మిత్, డికాక్, రబాడ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు సహా 49 మంది బేసిక్ ధర రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు. భారత ఆల్రౌండర్ షారుక్ ఖాన్ రూ.20 లక్షలతో బేసిక్ ధరతో ఉన్నా వేలంలో భారీ మొత్తం దక్కుతుందని ఆశిస్తున్నాడు. టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ బేసిక్ ధర రూ.50 లక్షల కేటగిరీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. నిషేధం పూర్తి చేసుకుని మైదానంలోకి దిగేందుకు ఎదురు చూస్తున్నానని ఇప్పటికే పలుమార్లు శ్రీశాంత్ చెప్పాడు.
* బేసిక్ రూ. 1.5 కోట్లు: అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ఆరోన్ ఫించ్, ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్, టిమ్ సౌథీ, జేమ్స్ నీషమ్
* బేసిక్ ధర రూ. కోటి: అజింక్య రహానె, కుల్దీప్ యాదవ్, నటరాజన్, హసరంగ, మార్క్రమ్, షంసి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
వివిధ దేశాలకు చెందిన దాదాపు 14,250 మంది క్రీడాకారుల కోసం ‘ఒలింపిక్ విలేజ్’ సిద్ధమవుతోంది. -
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
Suryakumar Yadav: ముంబయి ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఇన్స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అతడు ఐపీఎల్లో ఆడకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త హెయిర్ స్టైల్తో బరిలోకి దిగుతున్నాడు. -
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. -
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
ఈ సీజన్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గౌతమ్ గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. తన పదవీకాలం ముగిసే సమయానికి కేకేఆర్ని మెరుగైన స్థితిలో ఉంచుతానని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్కు షాక్ తగిలింది. హైదరాబాద్ ఆడే తొలి మూడు మ్యాచ్లకు స్పిన్నర్ వానిందు హసరంగ దూరం కానున్నాడు. -
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లోని ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. -
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్కు ఇక ప్రత్యేకంగా
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు