World cup: ఈ మూడు జట్లలో ఏదో ఒక జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: భారత మాజీ సెలెక్టర్
రానున్న ప్రపంచకప్పై భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. స్వదేశంలో జరిగే ఈ వరల్డ్కప్లో భారత్ ఫేవరెట్ అని పేర్కొన్నాడు
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఆయా జట్లు ఈ మెగా టోర్నీలో ఎలా ఆడాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నాయి. మరోవైపు పేవరెట్ జట్లు ఏవో.. ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో.. మాజీలు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో 1983 ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియా (Team India) జట్టులోని సభ్యుడు, మాజీ సెలెక్టర్ అయిన కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari srikanth).. రానున్న ప్రపంచకప్పై స్పందించాడు. స్వదేశంలో జరిగే ఈ వరల్డ్కప్లో భారత్ ఫేవరెట్ అని పేర్కొన్నాడు.
‘ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్ జట్టే. అయితే.. బలంగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల నుంచి సవాళ్లు ఎదురువుతాయి. ఆస్ట్రేలియాకు భారత్లో ఆడిన అనుభవం ఉంది. అందుకే.. భారత్, ఆసీస్, ఇంగ్లాండ్.. ఈ మూడు జట్లలో ఏదో ఒక జట్టు ప్రపంచకప్ గెలుస్తుందని నేను భావిస్తున్నా’ అని శ్రీకాంత్ ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. అయితే.. భారత్లో ఆడిన అనుభవం లేకపోవడంతో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ను తన జాబితాలో చేర్చలేదు.
‘నేను పాకిస్థాన్ను తీసివేయడం లేదు. కానీ.. వారు ఉపఖండం పరిస్థితులను ఉపయోగించుకుంటారు. అయితే.. భారత్లో మాత్రం వారు ఆడి చాలా కాలమైంది. అందుకే.. నేను భారత్, ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల వైపే మొగ్గుచూపుతాను’ అని వివరించాడు.
ఆల్రౌండర్లే కీలకం..
ఇక ఈ ప్రపంచకప్లో ఆల్రౌండర్లు కీలకమవుతారని శ్రీకాంత్ చెప్పాడు. ‘ఇక్కడి పరిస్థితులు భారత్కు అడ్వాంటేజ్గా మారతాయి. 2011లో మంచి ఆల్ రౌండర్లను చూశాం. అప్పుడు యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడాడు. అప్పటి ప్రపంచకప్లో యువీ ఆడిన మాదిరిగానే.. ఇప్పుడు జడేజా ప్రదర్శన ఉంటుందని నేను అనుకుంటున్నాను’ అని వివరించాడు. ప్రపంచకప్ గెలవాలంటే.. టీమ్ఇండియాలో జడేజా, అక్షర్ పటేల్లాంటి వారు కీలకంగా మారతారని పేర్కొన్నాడు. 2011లో టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచిన సమయంలో.. కృష్ణమాచారి శ్రీకాంత్ చీఫ్ సెలెక్టర్గా వ్యవహరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.