Lionel Messi : ధోనీ కుమార్తెకు జెర్సీ పంపిన మెస్సి.. ఫొటో వైరల్‌

సాకర్‌ దిగ్గజం మెస్సికి భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. క్రికెటర్లూ అతడిని ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో భారత అభిమానులపై తన ప్రేమను చాటాడు మెస్సి.

Updated : 28 Dec 2022 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఫుట్‌బాల్‌ దిగ్గజం, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ లియొనెల్‌ మెస్సి(Lionel Messi) ఫిఫా ప్రపంచ కప్‌(FIFA world cup 2022) ట్రోఫీని ముద్దాడి తన చిరకాల కలను నెరవేర్చుకున్న విషయం తెలిసిందే. టైటిల్‌ నెగ్గిన ఆనందంలో మునిగి తేలుతున్న  మెస్సి తన అభిమానులు, ఫాలోవర్లను మాత్రం మరిచిపోలేదు. ఇక భారత్‌లోనూ అతడికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. ధోనీ, కోహ్లీ లాంటి క్రికెటర్లూ అతడిని ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో ధోనీ కూతురు జీవా(Ziva)కు.. మెస్సి తాను సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీ(jersey)ని పంపి తన ప్రేమను చాటాడు.

ఆ జెర్సీని ఇన్‌స్టాలో పోస్టు చేసిన జీవా.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆ జెర్సీపై ‘జీవా కోసం’ అని రాసి దాని కింద మెస్సి సంతకం చేశాడు. గతంలో కూడా మెస్సి.. బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఇలాంటి జెర్సీనే పంపిన విషయాన్ని స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని