IPL 2024: అన్సోల్డ్ కావడం సంతోషమే.. అప్పుడు మా నాన్న ఒక మాట అన్నారు: ముషీర్ ఖాన్
ఐపీఎల్లో (IPL) ఆడితే కాసుల వర్షం. కానీ, ఓ తండ్రి మాత్రం తన కుమారులు జాతీయ జట్టు తరఫునే ఆడాలని కోరుకున్నాడు. అందులో ఒకరు ఆ లక్ష్యం సాధించగా.. మరొకరు రేసులో ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ ఫైనల్లో ముషీర్ఖాన్ (Musheer Khan) సెంచరీతో అలరించాడు. ముంబయి 42వసారి విజేతగా నిలవడంలో 19 ఏళ్ల కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. అయితే, అతడిని ఈసారి ఐపీఎల్లో చూడటం కష్టమే. గత ఐపీఎల్ (IPL) మినీ వేలంలో ముషీర్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు ఎవరూ అతడిని సంప్రదించలేదు. అయితే, తన అన్న సర్ఫరాజ్ ఖాన్ మాత్రం దిల్లీ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈక్రమంలో ఐపీఎల్లో ఆడలేకపోవడంపై తానేమీ బాధపడటం లేదని ముషీర్ వ్యాఖ్యానించాడు. ఈసందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. ఎప్పటికైనా తప్పకుండా ఐపీఎల్లోకి అడుగుపెడతాననే నమ్మకం ఉందని తెలిపాడు.
‘‘ఐపీఎల్ జాబితాలో నా పేరు లేదు. దానికేమీ నేను నిరుత్సాహపడటం లేదు. మా నాన్న ఒక విషయం చెప్పారు. ‘భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడాలి. ఐపీఎల్ అవకాశం ఎప్పుడైనా వస్తుంది. ఇవాళ కాకపోతే మరుసటి ఏడాది. కానీ, జాతీయజట్టులోకి అడుగుపెట్టడం అత్యంత కీలకం’ అనే మాటలు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు ఆడే అవకాశం రాకపోవడం కూడా మంచిదే. టీ20 క్రికెట్ను మరింత అర్థం చేసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. అప్పుడు, వచ్చే ఐపీఎల్లో నా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తా. ఈ ఫార్మాట్కు సన్నద్ధమవుతా.
రంజీ ఫైనల్లో శతకం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ నుంచే స్ఫూర్తి పొందా. అతడి నిబద్ధత, ఆడే విధానం అద్భుతం. మా ఇద్దరి బ్యాటింగ్ స్టైల్ కాస్త ఒకేలా ఉంటుంది. రంజీ ఫైనల్ ముందు ‘ఇది చాలా సాధారణ మ్యాచ్. అనవసరంగా ఒత్తిడికి గురి కావద్దు’ అని సర్ఫరాజ్ తెలిపాడు. బయట నుంచి చూస్తే నార్మల్ మ్యాచ్లానే ఉంటుంది. కానీ, మైదానంలోకి దిగాక మాత్రం వద్దనుకున్నా ఒత్తిడికి గురవుతుంటాం. బ్యాటింగ్లో ప్రాథమిక అంశాలను అనుసరించి పరుగులు చేయాలని సూచించాడు’’ అని ముషీర్ ఖాన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం