Narendra Modi: ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్ ఓటమి.. దేశం ఎప్పటికీ మీ వెంటే: ప్రధాని మోదీ

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైంది. దీనిపై భారత ప్రధాని మోదీ (Narendra Modi) స్పందించారు. 

Published : 20 Nov 2023 01:35 IST

దిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ (World Cup 2023 Fianl)లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. దేశం నేడు, ఎప్పటికీ మీ వెంటే ఉంటుందని టీమిండియా సభ్యులను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘‘డియర్‌ టీమిండియా, ఈ ప్రపంచ కప్‌లో ప్రదర్శన ద్వారా మీరు చూపిన ప్రతిభ, సంకల్పం గుర్తుంచుకోదగినది. గొప్ప స్ఫూర్తితో ఆడి.. దేశానికి గర్వకారణంగా నిలిచారు. మేమంతా ఈరోజు, ఎప్పటికీ మీ వెంటే ఉంటాం’’ అని పేర్కొన్నారు. 

అలాగే, ప్రపంచకప్‌విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో వారి ఆట ప్రదర్శన ప్రశంసనీయమని.. అద్భుతమైన విజయంతో ముగించారన్నారు. ఫైనల్‌లో అద్భుతంగా ఆడిన ట్రావిస్‌ హెడ్‌కు అభినందనలు తెలిపారు. అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌తో కలిసి స్టేడియంలో మోదీ మ్యాచ్‌ని వీక్షించారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ప్రపంచకప్‌ టైటిల్‌ను మోదీ, ఆసీస్ ఉప ప్రధాని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని