Netherlands: వన్డే ప్రపంచ కప్కు నెదర్లాండ్స్ జట్టు... తెలుగు మూలాలున్న తేజకు చోటు
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానునున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) కోసం నెదర్లాండ్స్ తమ జట్టును ప్రకటించింది. తెలుగు ములాలున్న తేజ నిడమనూరు (Teja Nidamanuru)కు జట్టులో చోటు దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. తాజాగా నెదర్లాండ్స్ (Netherlands) కూడా తమ జట్టు వివరాలను వెల్లడించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్గా 15మంది సభ్యులతో కూడిన టీమ్ను ప్రకటించింది. తెలుగు ములాలున్న తేజ నిడమనూరు (Teja Nidamanuru)కు నెదర్లాండ్స్ ప్రపంచకప్ జట్టులో చోటుదక్కింది. ఆల్రౌండర్ అయిన తేజ.. విజయవాడలో పుట్టి నెదర్లాండ్స్ జాతీయ జట్టుకు 2022 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్లో దేశవాళీ క్రికెట్ ఆడాడు.
‘ఇషాన్ 2 ఇన్ 1 ప్లేయర్.. ఆ ఓవర్లలో ఎలా ఆడాలో సూర్యకుమార్కు తెలీదు’
ఇక, నెదర్లాండ్స్ జట్టు విషయానికొస్తే.. వాన్ డెర్ మెర్వే, అకెర్మాన్లకు తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో వీరిద్దరూ ఆడలేదు. జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్లో నెదర్లాండ్స్ సత్తాచాటింది. సూపర్ సిక్స్ మ్యాచ్లో స్కాట్లాండ్పై భారీ విజయం సాధించి చివరి బెర్తును సొంతం చేసుకుంది. నెదర్లాండ్స్ ప్రపంచకప్ ఆడటం ఇది ఐదోసారి. చివరిసారిగా భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్లో ఆడింది. ఈ ప్రపంచకప్లో నెదర్లాండ్స్ తన మొదటి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా (అక్టోబర్ 6న) జరగనుంది.
నెదర్లాండ్స్ వన్డే ప్రపంచకప్ జట్టు:
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడే, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్.
ప్రాక్టీస్కు దూరంగా కోహ్లీ, రోహిత్!
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఆదివారం పాకిస్థాన్తో జరిగే మ్యాచ్ కోసం టీమ్ఇండియా (Team India) ప్రాక్టీస్ మొదలెట్టింది. కొలంబోలో మన ఆటగాళ్లు ఇండోర్ ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నారు. ఈ ఐచ్ఛిక (ఆప్షనల్) ప్రాక్టీస్ సెషన్కు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరంగా ఉండగా.. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ నెట్స్లో చాలా సమయం గడిపాడు. చివరి ఓవర్లలో శార్దూల్ ఠాకూర్ వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేలా కోచ్ ద్రవిడ్ అతనికి కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని బంతులను సంధించాడు. సూర్యకుమార్ యాదవ్కు కూడా ద్రవిడ్ పలు సూచనలు చేశాడు. శుభ్మన్ గిల్ కుడిచేతివాటం బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడు ప్రధానంగా స్వింగ్ బంతులు ఆడటంపై దృష్టి సారించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడు జిల్లాలో వైకాపా, తెదేపా కార్యకర్తల పరస్పర దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన