NED vs BAN: బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన నెదర్లాండ్స్
ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో ఆ జట్టుని నెదర్లాండ్స్ చిత్తుగా ఓడించింది.
కోల్కతా: ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో ఆ జట్టుని నెదర్లాండ్స్ చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఈ మోస్తరు లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 142 పరుగులకే కుప్పకూలింది. టాప్-6 బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మెహదీ హసన్ మిరాజ్ (35) టాప్స్కోరర్గా నిలవగా.. తాంజిద్ హసన్ (15) పరుగులు చేశాడు. లిట్టన్ దాస్ (3), నజ్ముల్ హొస్సేన్ శాంటో (9), షకీబ్ అల్ హసన్ (5), ముష్ఫికర్ రహీమ్ (1) ఘోరంగా విఫలమయ్యారు. మహ్మదుల్లా (20), మోహదీ హసన్ (17) పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4, బాస్ డీ లీడే 2, ఆర్యన్ దత్, వాన్ బీక్, అకెర్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
లక్ష్యఛేదనలో బంగ్లా ఏ దశలోనూ గట్టిగా పోరాడలేకపోయింది. ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడిన లిట్టన్దాస్ను ఆర్యన్ దత్ నాలుగో ఓవర్లో వెనక్కి పంపగా.. వాన్ బీక్ వేసిన తర్వాతి ఓవర్లో తాంజిద్ హసన్ పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ ఎడ్వర్డ్స్కు క్యాచ్ ఇచ్చారు. తర్వాత వచ్చిన నజ్ముల్, షకీబ్ కూడా క్రీజులో నిలవలేకపోయారు. నిలకడగా బౌండరీలు బాదిన హసన్ మిరాజ్ను బాస్ డీ లీడే ఔట్ చేయగా.. ముష్పీకర్ రహీమ్ను వాన్ మీకెరెన్ క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో 70 పరుగులకే బంగ్లా ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మహ్మదుల్లా, మెహదీ హసన్ నిలకడగా ఆడటంతో స్కోరు 100 దాటింది. అనంతరం వీరిద్దరూ స్వల్పవ్యవధిలో ఔటయ్యారు. బాస్ డీ లీడే బౌలింగ్లో మహ్మదుల్లా.. ఆర్యన్దత్కు చిక్కగా.. హసన్ రనౌటయ్యాడు. తర్వాత ముస్తాఫిజుర్ (20; 35 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది.
నెదర్లాండ్స్ బ్యాటర్లలో స్కాట్ ఎడ్వర్డ్స్ (68; 89 బంతుల్లో 6 ఫోర్లు), వెస్లీ బరేసి (41; 41 బంతుల్లో 8 ఫోర్లు) రాణించగా.. సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్ (35; 61 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు విక్రమ్జిత్ సింగ్ (3), మాక్స్ ఔడౌడ్ (0) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కోలిన్ అకెర్మాన్ (15), బాస్ డీ లీడే (17) పరుగులు చేశారు. చివర్లో వాన్ బీక్ (23; 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో నెదర్లాండ్స్ ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిపుల్ ఇస్లామ్ 2, ముస్తాఫిజుర్ రహ్మన్ 2, మెహదీ హసన్ 2, షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు