Nitish Reddy: సీమర్లను వదిలి.. స్పిన్నర్లను బాది: హిట్టింగ్పై నితీశ్ రెడ్డి
పంజాబ్పై హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని వెనుక తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిదే కీలక పాత్ర.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్పై హైదరాబాద్ విజయం సాధించడంలో ఓ తెలుగు కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ(64) తోపాటు బౌలింగ్లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. అతడి వల్లే 39/3 స్కోరుతో ఉన్న హైదరాబాద్ చివరికి 182 పరుగులు చేయగలిగింది. తన కీలక ఇన్నింగ్స్పై నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘వ్యక్తిగతంగా నా ఆట ఎంతో సంతృప్తినిచ్చింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. ఈసారి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగా. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పంజాబ్ సీమర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. అందుకే, దూకుడగా ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించలేదు. స్పిన్నర్లు వస్తారని.. వారిపై ఎటాక్ చేస్తే బాగుంటుందని ముందే అనుకున్నా. ఆ ప్రణాళిక ప్రకారమే ఆడాను. కగిసో రబాడ బౌలింగ్లో సిక్స్ కొట్టడం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రస్తుత టోర్నీలో సీమర్లు స్లో బౌన్సర్లతో ఇబ్బంది పెడుతున్నారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం. నేను బౌలింగ్ చేసేటప్పుడు కూడా ఇలానే బంతులేశా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏదైనా సరే జట్టు కోసం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా’’ అని నితీశ్ వెల్లడించాడు.
టీ20 గేమ్ అంటే ఇదే..: భువనేశ్వర్ కుమార్
హైదరాబాద్ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కటి బౌలింగ్ సంధించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో శిఖర్ ధావన్ స్టంపౌట్ కూడా ఉంది. మ్యాచ్ అనంతరం భువీ మాట్లాడుతూ.. ‘‘టీ20 గేమ్ ఇలానే ఉంటుంది. విజయం కోసం ఇరు జట్లూ తుది వరకూ పోరాడతాయి. ముల్లాన్పుర్ పిచ్ చివరి రెండు ఓవర్లలో చాలా మారిపోయింది. ఉత్కంఠపోరులో విజయం సాధించడం ఆనందంగా ఉంది. శిఖర్ ధావన్ను స్టంపౌట్ చేయడం అద్భుతం. వికెట్ కీపర్ క్లాసెన్ను ముందు ఉండమని కోరా. ఎందుకంటే శిఖర్ క్రీజ్ను వదిలి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో నేను పుణె వారియర్స్కు ఆడినప్పుడు కూడా ధావన్ ఇలానే స్టంపౌట్ అయ్యాడు. టోర్నీలో మున్ముందు విజయాలు సాధించాలంటే ఈ రకమైన వ్యూహాలను కొనసాగించాల్సి ఉంటుంది. నితీశ్ రెడ్డి చాలా బాగా ఆడాడు. చెన్నైపైనా అతడి బ్యాటింగ్ను చూస్తే ముచ్చటేసింది. ఆత్మవిశ్వాసంతో క్రీజ్లో పాతుకుపోతాడు. భారత క్రికెట్కు ప్రాతినిధ్యం వహించగల సత్తా అతడికి ఉంది’’ అని తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ఐపీఎల్లో పంజాబ్ అతి తక్కువ మార్జిన్తో ఓడిన మ్యాచుల్లో ఇది నాలుగోది. బెంగళూరు చేతిలో (2016) ఒక్క పరుగు, కోల్కతాపై (2020) 2 రన్స్, రాజస్థాన్ చేతిలో (2021) 2 పరుగుల తేడాతో ఓడింది.
- ఐపీఎల్లో అతి తక్కువ మార్జిన్తో హైదరాబాద్ గెలిచిన తొలి మ్యాచ్ ఇదే. ఇప్పుడు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2022లో ముంబయిపై 3 పరుగులు, 2014లో దిల్లీపై 4 పరుగులు, 2016లో పుణె, బెంగళూరు జట్లపై నాలుగేసి పరుగుల తేడాతో గెలిచింది.
- ఐపీఎల్లో పంజాబ్పై హైదరాబాద్ విజయాల శాతం 68.18. ఇప్పటి వరకు 22 మ్యాచుల్లో తలపడగా 15 హైదరాబాద్ గెలిచింది. గతంలో కోల్కతాపై ముంబయి 71.88 శాతం, హైదరాబాద్పై చెన్నై 70 శాతం, డెక్కన్ ఛార్జర్స్పై పంజాబ్ 70 శాతం విజయాలను నమోదు చేశాయి.
- పంజాబ్పై కీలక ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ రెడ్డికిదే తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’