Gautam Gambhir: ఒక్క ఓటమి కారణంగా రోహిత్ను బ్యాడ్ కెప్టెన్ అని ఎలా అంటారు?: గంభీర్
వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ తీరుపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు.
ఇంటర్నెట్డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)లో వరుస విజయాలతో టీమ్ఇండియా (Team India)ను ఫైనల్కు చేర్చిన సారథి రోహిత్ శర్మ (Rohit Sharma)పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. రోహిత్ సేన ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడాడు. భారత్ ఖాతాలో ఒక్క బ్యాడ్ గేమ్ తప్పించి.. టోర్నీ మొత్తం ఆధిపత్యం చెలాయించిందని పేర్కొన్నాడు.
‘‘రోహిత్ది గొప్ప కెప్టెన్సీ. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవడం అంత సులువైన విషయం కాదు. ఈ వన్డే ప్రపంచకప్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన తీరు అద్భుతం. వరల్డ్ కప్ ఫైనల్కు ముందు కూడా ఇదే విషయం చెప్పాను. ఫైనల్లో ఎలాంటి ఫలితం వచ్చినా.. భారత్ ఛాంపియన్లా ఆడింది. ఒక బ్యాడ్ గేమ్ రోహిత్ శర్మను, అతడి జట్టును చెడ్డగా మార్చదు. పది మ్యాచ్ల్లో ఎంతో గొప్పగా ఆడారు. ఒక్క ఓటమి కారణంగా రోహిత్ను బ్యాడ్ కెప్టెన్ అనడం సరికాదు’’ అని ఓ మీడియా పాడ్కాస్ట్లో గంభీర్ వివరించాడు.
కుర్రాళ్లకు పరీక్ష.. దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టీ20 నేడు
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో రోహిత్ టీమ్ఇండియాకు సారథ్యం వహించాలని గంభీర్ సూచించాడు. ‘‘రోహిత్ మంచి ఫామ్లో ఉంటే.. 2024 పొట్టి క్రికెట్ ప్రపంచకప్లో భారత్ను నడిపించాలి. ఫామ్లో లేకపోతే ఎంపిక చేయవద్దు. వయసు ఆధారంగా ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించకూడదు. ఫామ్ ఆధారంగానే ఆ ప్రక్రియ కొనసాగాలి’’ అని గంభీర్ వివరించాడు. ఇక రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని అతడు పేర్కొన్నాడు. టీమ్ఇండియా నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ ఫార్మాట్కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్గా చేస్తున్నాడు. ఆ తర్వాత సఫారీలతో వన్డే సిరీస్ను కేఎల్ రాహుల్ సారథ్యంలో.. టెస్టు సిరీస్ను రోహిత్ కెప్టెన్సీలో టీమ్ఇండియా ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!