IND vs PAK: బ్యాటింగ్ లైనప్లో దాయాది దేశాలకు మధ్య తేడా అదే: సంజయ్ బంగర్
టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ పోరుకు ఇంకా 17 రోజులు మాత్రమే ఉంది. ఈసారి ఎలాగైనా పాక్ను మట్టికరింపిచాలని టీమ్ఇండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ పోరుకు ఇంకా 17 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే టీమ్ఇండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. అక్టోబర్ 17న ఆసీస్, అక్టోబర్ 19న కివీస్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచులను ఆడనుంది. ఇక అక్టోబర్ 23న పాక్ మ్యాచ్తో టీమ్ఇండియా కప్ వేటను ప్రారంభించనుంది. గత టీ20 ప్రపంచకప్లో భారత్పై పాక్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా పాక్ను మట్టికరిపించాలని టీమ్ఇండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు జట్ల బలాలపై భారత బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ విశ్లేషించాడు. టీమ్ఇండియాలో నలుగురైదుగురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, అదే పాకిస్థాన్ అయితే ఓపెనర్లపైనే అధికంగా ఆధారపడుతోందని వ్యాఖ్యానించాడు.
(పాత చిత్రం)
‘‘భారత్, పాకిస్థాన్ జట్ల బ్యాటింగ్ ఆర్డర్ను గమనిస్తే.. పాక్ ఎక్కువగా ఓపెనర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ మీదనే ఆధారపడుతోంది. కానీ టీమ్ఇండియాకు అలాంటి పరిస్థితి లేదు. ఒకరిద్దరిని నమ్ముకొని ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కనీసం నలుగురైదుగురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా వారంతా మంచి ఫామ్లో ఉండటం విశేషం. అందుకే బ్యాటింగ్ విభాగంలో పాక్ కంటే భారత్ మంచి స్థాయిలో ఉంది’’
‘‘ఇక బౌలింగ్ను గమనిస్తే మాత్రం ఇందులో దాయాది దేశమే కాస్త పైచేయి సాధించేలా ఉంది. మంచి ఫాస్ట్ బౌలర్లు వారికి ఉన్నారు. అయితే భారత్కు బుమ్రా స్థానంలో దీపక్ చాహర్ వస్తే మాత్రం స్వింగ్ అక్కరకొస్తుంది. ఎలాగూ అర్ష్దీప్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉండటం కలిసొచ్చే అంశం. కానీ పాక్తో పోలిస్తే మాత్రం మన పేస్ దళం కొంచెం వీక్గానే ఉంది. ఆసియా కప్లో భారత్, పాక్ మధ్య అద్భుతమైన మ్యాచ్లను చూశాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు టీమ్ఇండియా కాస్త పరిపూర్ణత సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే వ్యక్తిగత ప్రదర్శనల మీద కాకుండా జట్టుగా రాణించడంపైనే భారత్ దృష్టిసారించింది’’ అని సంజయ్ బంగర్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్