- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Virat Kohli: ‘కోహ్లీ ఫామ్లోకి రావాలంటే అదొక్కటే తేలికైన మార్గం’
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి రావాలంటే ఒకటే మార్గం ఉందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. వన్డే క్రికెట్ ఆడటంతోనే అతడు ఫామ్లోకి వస్తాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవల టీమ్ఇండియా జట్టులో టాప్ఆర్డర్లో వీలైనన్ని ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కుదిరినప్పుడల్లా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్లకే ఈ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకు కారణం కేఎల్ రాహుల్ గాయం బారినపడటం ఒకటైతే.. మరొకటి విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వడం. దీంతో టాప్ఆర్డర్లో యువ బ్యాట్స్మెన్ తమ సత్తా నిరూపించుకునేందుకు మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్.. కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా ఓపెనర్ అవతారమెత్తాడు. అంతకుముందు రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్లు కూడా పొట్టి ఫార్మాట్లో ఓపెనర్లుగా వచ్చారు. ఈ విషయంపైనే స్పందించిన పార్థివ్ పటేల్.. టీమ్ఇండియా కోహ్లీని తుది జట్టులో ఉంచాలని చూస్తున్నందునే ఇలా యువకులకు ఓపెనర్లుగా అవకాశం ఇస్తోందని చెప్పాడు. ‘కోహ్లీ వన్డే క్రికెట్ ఆడితే నాకు చూడాలని ఉంది. అతడు ఫామ్లోకి రావాలంటే ఈ ఫార్మాటే తేలికైన మార్గం. 50 ఓవర్ల ఆటలో చాలా సమయం ఉంటుంది. ధావన్, శుభ్మన్ కూడా ఇలాగే వన్డే క్రికెట్లో ఫామ్లోకి వచ్చారు. వాళ్లిద్దరూ ఇంతకుముందు జరిగిన మ్యాచ్ల్లో బంతికో పరుగు చొప్పున రాబట్టారు’ అని పటేల్ చెప్పుకొచ్చాడు.
‘క్రికెట్లో విరాట్ కోహ్లీ ఒక దిగ్గజం. మనం ఇప్పుడు చూస్తున్న మార్పులన్నీ ఓపెనింగ్ విభాగంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇదంతా టీమ్ఇండియా కోహ్లీని తుది జట్టులో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నమే. అందుకే సూర్యకుమార్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లను ఓపెనర్లుగా పంపిస్తున్నారని నేను అనుకుంటున్నా’ అని పటేల్ అభిప్రాయపడ్డాడు. కాగా, విరాట్ కొద్ది కాలంగా సరైన ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, అతడికి పలువురు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు ప్రస్తుత విండీస్ పర్యటనలో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nithyananda: నిత్యానందపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
-
General News
Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్రావు
-
Movies News
Chiranjeevi: సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ట్రోఫీ.. జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Manish Sisodia: 16 మంది నిందితుల్లో సిసోదియా నం.1: సీబీఐ ఎఫ్ఐఆర్
-
Movies News
ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్గా పంపించాలనే ఐడియా ఎవరిది..?