Virat Kohli: ‘కోహ్లీ ఫామ్లోకి రావాలంటే అదొక్కటే తేలికైన మార్గం’
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి రావాలంటే ఒకటే మార్గం ఉందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. వన్డే క్రికెట్ ఆడటంతోనే అతడు ఫామ్లోకి వస్తాడని అభిప్రాయపడ్డాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి రావాలంటే ఒకటే మార్గం ఉందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. వన్డే క్రికెట్ ఆడటంతోనే అతడు ఫామ్లోకి వస్తాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవల టీమ్ఇండియా జట్టులో టాప్ఆర్డర్లో వీలైనన్ని ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కుదిరినప్పుడల్లా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్లకే ఈ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకు కారణం కేఎల్ రాహుల్ గాయం బారినపడటం ఒకటైతే.. మరొకటి విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వడం. దీంతో టాప్ఆర్డర్లో యువ బ్యాట్స్మెన్ తమ సత్తా నిరూపించుకునేందుకు మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్.. కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా ఓపెనర్ అవతారమెత్తాడు. అంతకుముందు రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్లు కూడా పొట్టి ఫార్మాట్లో ఓపెనర్లుగా వచ్చారు. ఈ విషయంపైనే స్పందించిన పార్థివ్ పటేల్.. టీమ్ఇండియా కోహ్లీని తుది జట్టులో ఉంచాలని చూస్తున్నందునే ఇలా యువకులకు ఓపెనర్లుగా అవకాశం ఇస్తోందని చెప్పాడు. ‘కోహ్లీ వన్డే క్రికెట్ ఆడితే నాకు చూడాలని ఉంది. అతడు ఫామ్లోకి రావాలంటే ఈ ఫార్మాటే తేలికైన మార్గం. 50 ఓవర్ల ఆటలో చాలా సమయం ఉంటుంది. ధావన్, శుభ్మన్ కూడా ఇలాగే వన్డే క్రికెట్లో ఫామ్లోకి వచ్చారు. వాళ్లిద్దరూ ఇంతకుముందు జరిగిన మ్యాచ్ల్లో బంతికో పరుగు చొప్పున రాబట్టారు’ అని పటేల్ చెప్పుకొచ్చాడు.
‘క్రికెట్లో విరాట్ కోహ్లీ ఒక దిగ్గజం. మనం ఇప్పుడు చూస్తున్న మార్పులన్నీ ఓపెనింగ్ విభాగంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇదంతా టీమ్ఇండియా కోహ్లీని తుది జట్టులో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నమే. అందుకే సూర్యకుమార్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లను ఓపెనర్లుగా పంపిస్తున్నారని నేను అనుకుంటున్నా’ అని పటేల్ అభిప్రాయపడ్డాడు. కాగా, విరాట్ కొద్ది కాలంగా సరైన ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, అతడికి పలువురు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు ప్రస్తుత విండీస్ పర్యటనలో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?