SA vs BAN: డికాక్ భారీ శతకం.. క్లాసెన్, మిల్లర్ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోరు
సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తన సూపర్ ఫామ్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్లో వరుసగా రెండు సెంచరీలు బాదిన అతడు.. తాజాగా మరో శతకం సాధించాడు.
ముంబయి: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) తన సూపర్ ఫామ్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్లో వరుసగా రెండు సెంచరీలు బాదిన అతడు.. తాజాగా మరో శతకం సాధించాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో డికాక్ (174; 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్లు) భారీ శతకం బాదగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (90; 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (34*; 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో డికాక్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. చివరి 13 ఓవర్లలో సౌతాఫ్రికా 174 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 2, షోరిఫుల్, హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (12; 19 బంతుల్లో), వన్డౌన్లో వచ్చిన వాండర్ డసెన్ (1) విఫలమయ్యారు. నిలకడగా ఆడుతున్న హెండ్రిక్స్ను ఆరో ఓవర్లో షోరిఫుల్ ఇస్లామ్ వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన డసెన్ను మెహదీ హసన్ మిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం డికాక్, మార్క్రమ్ నిలకడగా బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. డికాక్ 47 బంతుల్లో, మార్క్రమ్ 57 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన మార్క్రమ్.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో లిట్టన్ దాస్కు చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. చివర్లో డికాక్ గేర్లు మార్చి ఆడాడు. షోరిఫుల్ వేసిన 42 ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ బాదిన అతడు.. షకీబ్ వేసిన తర్వాతి ఓవర్లో 6, 4, 6, 4 బాదేసి 150ల్లోకి వచ్చేశాడు.
షోరిఫుల్ వేసిన మరో ఓవర్లో డికాక్ వరుసగా రెండు బౌండరీలు రాబట్టగా.. క్లాసెన్ సిక్స్ కొట్టాడు. డబుల్ సెంచరీపై కన్నేసిన డికాక్ను హసన్ మమమూద్ ఔట్ చేశాడు. డికాక్ ఔటైన తర్వాత క్లాసెన్ మరింత ధాటిగా ఆడాడు. మహమూద్ బౌలింగ్లో సిక్స్ బాదిన క్లాసెన్.. ముస్తాఫిజుర్ వేసిన 47 ఓవర్లో వరుసగా 6,4,6 దంచాడు. మిల్లర్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షోరిఫుల్ వేసిన 49 ఓవర్లో రెండు సిక్స్లు, ఓ ఫోర్ బాదాడు. మహమూద్ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాదిన క్లాసెన్ తర్వాతి బంతికే మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.