Rahul Dravid: నా కాంట్రాక్ట్ ముగిసింది.. దాని గురించి ఇప్పుడేం చెప్పలేను: ద్రవిడ్
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఫైనల్ తర్వాత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) వన్డే ప్రపంచకప్ను చేజార్చుకుంది. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే కల కలగానే మిగిలిపోయింది. ఇదే సమయంలో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం కూడా అధికారికంగా ముగిసింది. బీసీసీఐ కాంట్రాక్ట్ ప్రకారం వన్డే ప్రపంచకప్ ఫైనల్తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. తన రెండేళ్ల కాలంలో ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండుసార్లు ఫైనల్స్కు, ఒకసారి సెమీస్కు జట్టును తీసుకెళ్లాడు. ఆసియా కప్లో విజేతగా నిలిపాడు. దీంతో అతడిని కొనసాగిస్తారనే వాదనా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. కనీసం ఒక్క ఫార్మాట్లోనైనా జట్టుకు కోచ్గా వ్యవహరించే అవకాశం వస్తే స్వీకరిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
‘‘ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే లేదు. దాని గురించి తీరికా లేదు. మెగా టోర్నీపైనే దృష్టిసారించాం. సమయం ఉండుంటే ఆలోచించి ఉండేవాడినేమో. కానీ, వన్డే ప్రపంచకప్ సమయంలో మా దృష్టంతా దీనిపైనే ఉంచాం. ఇక నా రెండేళ్ల పనితీరుపై బయట నుంచి ఎన్ని వ్యాఖ్యలు వచ్చినా పట్టించుకోను. నా బాధ్యతలను ఎలా నిర్వర్తించానని స్వయంగా విశ్లేషించుకుంటా. ఇలాంటి జట్టుతో పని చేసినందుకు గర్వపడుతున్నా. అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లతో కలిసిపోయి పని చేయడం ఆనందంగా ఉంది. ఎంతో గౌరవంగా భావిస్తున్నా’’ అని ద్రవిడ్ తెలిపాడు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్నకూ..
వచ్చేఏడాది యూఎస్ఏ, వెస్టిండీస్ దేశాల ఆతిథ్యంలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీంతో ఆ టోర్నీకి కూడా జట్టుకు కోచింగ్ వ్యవహారాలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నారా? అనే ప్రశ్నకు ద్రవిడ్ సమాధానం ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. ఇప్పటికైతే ఎలాంటి ప్రణాళికలు లేవు. అలాగే 2027 ప్రపంచకప్ గురించి కూడా ఇప్పుడే ఆలోచించడం సరికాదు. ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లరు? అనేది చెప్పడం కష్టం. దానికి చాలా సమయం ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.
రోహిత్ అద్భుతమైన నాయకుడు
‘‘రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్. వన్డే ప్రపంచ కప్లో భారత్ను అద్భుతంగా నడిపించాడు. మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్లోనూ ఆటగాళ్లలో ఉత్తేజం నింపాడు. ఎప్పుడు అవసరమైనా తక్షణమే అందుబాటులో ఉంటాడు. చర్చకైనా, సమావేశాలకైనా వచ్చేస్తాడు. ప్రతి మ్యాచ్ కోసం ముందే పక్కాగా ప్లానింగ్ ఉంటుంది. అయితే, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ తీవ్ర నిరుత్సాహానికి గురైంది. వారిని ఇలా చూడటం బాధగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడి వరకు వచ్చారు. కోచ్గా వారిని ఇలా చూడటం చాలా కష్టంగా ఉంటుంది’’ అని ద్రవిడ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు