Rahul Dravid: సెమీస్లో ఒత్తిడి.. రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర సమాధానం..
వరల్డ్ కప్లో టీమ్ఇండియా ఇక సెమీస్ కోసం సిద్ధమవుతోంది. బుధవారం ముంబయి వేదికగా న్యూజిలాండ్తో తొలి సెమీ ఫైనల్లో భారత్ (IND vs NZ) తలపడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) వరుసగా తొమ్మిది విజయాలతో టీమ్ఇండియా (Team India) సెమీస్కు దూసుకుపోయింది. నవంబర్ 15న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. గత వరల్డ్ కప్ సెమీస్లో కివీస్ చేతిలోనే టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. దీంతో ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నాకౌట్లో ఒత్తిడి గురించి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక వ్యాఖ్యలు చేశాడు. నెదర్లాండ్స్తో చివరి మ్యాచ్ అనంతరం మీడియాతో ద్రవిడ్ మాట్లాడాడు.
‘‘వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దీన్ని అంగీకరించడానికి నాకేం ఇబ్బంది లేదు. అసలు ఒత్తిడే లేదని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు. చివరి వరకూ ఎవరు విజయం సాధిస్తారనే గ్యారెంటీ ఉండదు. సన్నద్ధత బాగుండి.. మైదానంలో ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం లభిస్తుంది. వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఉన్నప్పుడు అంతా బాగుంటుందనిపిస్తుంది. ఒక్క ఓటమి ఎదురైతే చాలు.. ప్రతి ఒక్కరూ ‘మీకేం తెలియదు’ అంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఇదంతా సహజమే.
నెదర్లాండ్స్తో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాలు చేయడం ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా శ్రేయస్ ఫామ్ను అందుకోవడం సంతోషం. నాలుగో స్థానంలో ఆడే ఆటగాడి కోసం గత పదేళ్లుగా కొనసాగిన అన్వేషణ కష్టంగా ఉందనేది అందరికీ తెలిసిందే. శ్రేయస్ రూపంలో నాణ్యమైన బ్యాటర్ దొరికాడు. ఇక ఈ వరల్డ్ కప్లో వరుసగా 9 మ్యాచుల్లోనూ విజయం సాధించాం. తొలి రోజు ఆట నుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో ఆడాం’’ అని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!