Ashiwn: భారత్ సరిగ్గా ఆడలేదనడం సరైంది కాదు: పాంటింగ్కు అశ్విన్ కౌంటర్
టీ20 ప్రపంచకప్ సూపర్ -12 దశలో భారత్ మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకొంది. చివరి మ్యాచ్లో ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమ్ఇండియా నేరుగా సెమీస్ చేరుకొంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘ఇప్పటి వరకు టీమ్ఇండియా తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేదు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఇరగదీశాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనే అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. టీమ్ఇండియా విజయాలు సాధించాలంటే విరాట్ ఆడాల్సిందే’’ అని క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ తాజాగా స్పందించాడు. ఆదివారం జింబాబ్వేతో టీమ్ఇండియా గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో అశ్విన్ ప్రెస్ కాన్ఫెరెన్స్లో మాట్లాడాడు.
‘‘టీ20 ప్రపంచకప్లో కొన్ని మ్యాచుల్లో చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్పై ఇలానే జరిగింది. అయితే టీ20 ఫార్మాట్ అంటేనే మలుపులు సర్వసాధారణం. కచ్చితంగా ఏదొక సమయంలో మార్పు వస్తుందని భావిస్తున్నా. మ్యాచ్ను చూసే అభిమానులు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పటికీ మ్యాచ్ నుంచి మేం నేర్చుకుంటూనే ఉంటాం. చిన్న మార్జిన్తో మ్యాచ్ మారిపోతుంటుంది. గతంలో నిపుణులు, మాజీ క్రికెటర్లతో మాట్లాడిన సందర్భాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్లు. జట్టు సరిగా ఆడలేదని, మంచి ప్రదర్శన ఇవ్వలేదని అనడం సరైందికాదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడాల్సి ఉంటుంది’’ అని అశ్విన్ తెలిపాడు. జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది.
ఇప్పుడది లీగల్..
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా నాన్స్ట్రైకింగ్లోని డేవిడ్ మిల్లర్ కాస్త క్రీజ్ దాటి ముందుకు వచ్చినప్పటికీ అశ్విన్ రనౌట్ చేయలేదు. భారత టీ20 లీగ్లో బట్లర్ను మన్కడింగ్ చేసినప్పుడు చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు ఇలాంటి రనౌట్ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ‘‘నిజం చెప్పాలంటే నాకు ఇలా రనౌట్ కావడం ఇష్టం ఉండదు. నాకే కాకుండా ఇతర బ్యాటర్లకూ ఇష్టం ఉండకపోవచ్చు. అలాగే బంతిని తన్ని ఔట్ కావడం, బౌల్డ్, రనౌట్ మాత్రమే కాకుండా ఎల్బీగా కూడా పెవిలియన్కు చేరడం ఇష్టపడను. అయితే ఇప్పుడు నాన్ స్ట్రైకర్ రనౌట్ చట్టబద్ధం. చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత చేశారు. అయితే ఇప్పటికీ కొందరు వివాదాస్పదం చేయడానికి చూస్తేనే ఉంటారు’’ అని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
పొట్టి ప్రపంచకప్లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-17 సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. ఈమేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. -
T20 World Cup 2024: న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా పేర్లు
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్