Cricket News: రంజీ ట్రోఫీలో రియాన్ పరాగ్ రికార్డు సెంచరీ.. టెస్టులకు దక్షిణాఫ్రికా స్టార్ గుడ్ బై
రంజీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) రికార్డు శతకం సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ కాస్లెన్ (Heinrich Klaasen) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) రికార్డు శతకం సాధించాడు. ఎలైట్ గ్రూప్ బిలో ఛత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో 56 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొత్తం 87 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 12 సిక్స్ల సాయంతో 155 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. రిషభ్ పంత్ ఝార్ఖండ్పై 2016-17 సీజన్లో 48 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్లో అస్సాంపై ఛత్తీస్గఢ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఛత్తీస్గఢ్ 327 పరుగులకు ఆలౌట్ కాగా.. అస్సాం 159 రన్స్కే కుప్పకూలి ఫాలోఅన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లో రియాన్ పరాగ్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 254 పరుగులు చేసి 87 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు ఏకనాథ్ కెర్కర్ (31), రిషభ్ తివారీ (48) రాణించడంతో ఈ స్వల్ప టార్గెట్ని ఛత్తీస్గఢ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 20 ఓవర్లలో ఛేదించింది.
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా హిట్టర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ కాస్లెన్ (Heinrich Klaasen) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్లకే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి తప్పుకోవడం గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, తాను తీసుకునే నిర్ణయం సరైందా? కాదా అని ఎంతో మదనపడ్డానని పేర్కొన్నాడు. చివరకు సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైనదని, తన ఫేవరెట్ క్రికెట్ ఫార్మాట్కు దూరం అవుతున్నందుకు ఎంతో బాధగా ఉందని క్లాసెన్ పేర్కొన్నాడు. వన్డేలు, టీ20ల్లో ఆకట్టుకుంటున్న క్లాసెన్కు టెస్టుల్లో మంచి రికార్డేమీ లేదు. 2019లో అరంగేట్రం చేసి కెరీర్లో నాలుగే టెస్టులు ఆడి 104 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు