Rohit Counter to Cummins: గతం గతః.. ఇప్పుడెలా ఉన్నామన్నదే ముఖ్యం: కమిన్స్కు రోహిత్ కౌంటర్..!
ప్రపంచకప్ ఫైనల్కు ముందే మాటల యుద్ధం మొదలైంది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలకు రోహిత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
ఇంటర్నెట్డెస్క్: ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన కామెంట్లు(Pat Cumins Comments).. దానికి ప్రతిగా రోహిత్ ఇచ్చిన కౌంటర్తో ప్రపంచకప్ ఫైనల్ మరింత హీట్ పెంచింది. తమకు అద్భుతమైన అదనపు బలం ఉందంటూ ఆసీస్ కెప్టెన్ కమిన్స్ చేసిన కామెంట్లకు హిట్మ్యాన్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇటీవల కమిన్స్ మాట్లాడుతూ 2015లో ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లు పెద్దసంఖ్యలో తమ జట్టులో ఉన్నారని.. ఆ అనుభవం తమకు కలిసి వస్తుందని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని నిన్న రోహిత్ శర్మ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్(Pre Match Conference)లో విలేకర్లు ప్రస్తావించారు. దీనికి హిట్ మ్యాన్ తనదైన శైలిలో స్పందించాడు.
‘‘ప్రపంచకప్(World Cup) గతంలో గెలిచిన ఆటగాళ్లు ఉండటాన్ని అడ్వాంటేజ్ అని వారు అనుకొంటుండొచ్చు.. కానీ, మేము దానిని నమ్మం. ఫైనల్ ఆడిన అనుభవం కంటే ప్రస్తుత ఫామ్, మన ఆలోచనా తీరు చాలా ముఖ్యం. వారు ఒత్తిడిని ఎలా తట్టుకోగలరు అనేది కీలకం. అతడు (కమిన్స్) ఏ కోణంలో ఈ మాట అన్నాడో నాకు అర్థమైంది. నా అభిప్రాయం ప్రకారం ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు’’ అని రోహిత్ (Rohit Sharma) విశ్లేషించాడు.
ODI WC Final 2023: భారత్ vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
భారత్తో పోలిస్తే.. టోర్నీలో అంతగా ఆధిపత్యం చూపని ఆస్ట్రేలియాను ఎదుర్కోవడంపై ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించగా.. రోహిత్ స్పందిస్తూ.. ‘‘ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఆధిపత్యం చూపలేదంటే నేను అంగీకరించను. వారు గత ఎనిమిది మ్యాచ్లు గెలిచారు. వారు బాగా ఆడారు. ఆస్ట్రేలియా ఏమి చేయగలదో అనే దానిపై నాకు అవగాహన ఉంది. వారు చాలా పరిపూర్ణమైన ఆటగాళ్లు. దీంతో అద్భుతమైన పోటీ ఉండనుంది’’ అని పేర్కొన్నాడు.
మేము ద్రవిడ్ కోసం ఇది చేయాలనుకుంటున్నాం..
జట్టు విజయాల్లో ద్రవిడ్ పాత్ర ఏమిటని అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానం చెబుతూ.. ‘‘జట్టు ఆటగాళ్లకు తమ పాత్రపై స్పష్టత ఉండటంలో ద్రవిడ్ పాత్ర అత్యంత కీలకం. రాహుల్ తన కెరీర్లో ఆడిన క్రికెట్(Cricket).. ఇప్పుడు నేను ఆడుతున్న క్రికెట్కు చాలా తేడా ఉంది. ఈ విషయాన్ని అతడు అంగీకరించి.. మేము ఆడాలనుకున్న విధానంలో ముందుకు వెళ్లడానికి అవసరమైన స్వేచ్ఛను ఇవ్వడమే అతని గురించి చాలా చెబుతుంది. అత్యంత కీలకమైన ఈ క్షణాల్లో అతడు కూడా భాగస్వామి కావాలనుకున్నాడు. ఇప్పుడు అతడి కోసం దానిని పూర్తి చేసి (కప్పు గెలిచి) ఇవ్వడం అనే బాధ్యత మాపై ఉంది’’ అని పేర్కొన్నాడు.
ఇక షమీపై రోహిత్ స్పందిస్తూ.. ప్రారంభ మ్యాచ్ల్లో రిజర్వు బెంచ్కు పరిమితం కావడం అతడికి (షమికి) కష్టమైన పనే. అతడు బుమ్రాకు మద్దతుగా ఉండటం అతడి పని. అతడు జట్టు సభ్యుడిగా చేయగలిగినంతగా చేశాడని వెల్లడించాడు.
భారత అభిమానులను సైలెంట్గా ఉంచడంలోనే సంతృప్తి : కమిన్స్
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ (World Cup Final Match 2023) సందర్భంగా భారత ఫ్యాన్స్ను సైలెంట్గా ఉంచడంలోనే తనకు సంతృప్తి ఉంటుందని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్(Pre Match Press Conference)లో అతడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏకపక్షంగా ఉన్న ప్రేక్షకుల మధ్యలో తమ జట్టు భారత్తో తలపడుతుందని అన్నాడు. ‘‘హోమ్ టీమ్తో అద్భుతమైన గేమ్ జరగబోతోంది. ప్రేక్షకులు మొత్తం వారికి మద్దతుగా ఉంటారు. ఇప్పటి వరకు ప్రపంచకప్లో భారత్ అజేయంగా ఉంది. ఫ్యాన్స్ ఏకపక్షంగా ఉండబోతున్నారు. వారందరిని సైలెంట్గా ఉంచగలిగితే (భారత్ను షాక్కు గురిచేసి) మాకు సంతృప్తిగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం