Rohit Sharma: ఐపీఎల్లో సిక్స్ల రికార్డు.. తొలి భారత క్రికెటర్గా రోహిత్ శర్మ
తన జట్టు పోరాడి ఓడినప్పటికీ.. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అలాగే అర్జున్ తెందూల్కర్ కూడా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ (MI vs PBKS) ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 214/8 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి 201/6 స్కోరుకే పరిమితమైంది. కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57) అర్ధశతకాలు సాధించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (44) కూడా రాణించినా ఓటమి మాత్రం తప్పలేదు. జట్టు ఓడినప్పటికీ రోహిత్ ఖాతాలో ఓ రికార్డు చేరింది. ఐపీఎల్లో 250 సిక్స్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా అవతరించాడు. మొత్తంగా చూస్తే మూడో బ్యాటర్. రోహిత్ కంటే ముందు క్రిస్ గేల్ (357), ఏబీ డివిలియర్స్ (251) మాత్రమే ఉన్నారు. భారత్ నుంచి రోహిత్ కాకుండా ఎంఎస్ ధోనీ (235), విరాట్ కోహ్లీ (229) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇప్పటి వరకు 233 మ్యాచుల్లో 6,058 పరుగులు చేసిన రోహిత్ 130.22 స్ట్రైక్రేట్తో కొనసాగుతున్నాడు.
అర్జున్ ఖాతాలో చెత్త రికార్డు
సొంతమైదానంలో వికెట్ సాధించిన అర్జున్ తెందూల్కర్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించిన రెండో ముంబయి బౌలర్గా మారాడు. పంజాబ్పై ఇన్నింగ్స్లోని 16వ ఓవర్ వేసిన అర్జున్ నాలుగు ఫోర్లు, రెండు సిక్స్లు,వైడు, నోబాల్, సింగిల్తో కలిపి 31 పరుగులు సమర్పించాడు. ముంబయి తరఫున అత్యధికంగా డేనియల్ సామ్స్ 2022 సీజన్లో కోల్కతాపై ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. వీరిద్దరి తర్వాత పవన్ సూయల్, అల్జారీ జోసెఫ్, మెక్క్లాగెన్ 28 పరుగులు సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.