IPL Mega Auction : ఆర్సీబీ.. ఆ ముగ్గురి కోసమే సగం ఖర్చు చేసింది!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్ను అట్టిపెట్టుకుంది. ఒక్కో జట్టులో...
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్ను అట్టిపెట్టుకుంది. ఒక్కో జట్టులో కనిష్ఠంగా 18 మంది నుంచి గరిష్ఠంగా 25మంది సభ్యుల వరకు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ రూ.57 కోట్లతో మెగా వేలంలోకి వచ్చింది. అయితే అందులో సగం (రూ.28.50 కోట్లు) కేవలం ముగ్గురి కోసమే వెచ్చించడం గమనార్హం. మిగిలిన ఆటగాళ్ల కోసం మరో సగం సొమ్ము మాత్రం వెచ్చించే అవకాశం ఉంది. గత ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్పై రూ. 10.75 కోట్లు, ఆల్రౌండర్ వనిందు హసరంగపై రూ. 10.75 కోట్లు ఖర్చు చేయగా.. బ్యాటర్ డు ప్లెసిస్ను రూ.7 కోట్లకు దక్కించుకుంది.
హర్షల్ పటేల్: గత సీజన్లో అద్భుతమైన బౌలింగ్తో పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. అత్యధికంగా 32 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబయి ఇండియన్స్ మీద ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన ఏకైక బౌలర్ కూడా హర్షల్ పటేలే. అందుకే ఆర్సీబీ మరోసారి ఈ బౌలర్పై నమ్మకంతో భారీ ధరను వెచ్చించి మరీ సొంతం చేసుకుంది.
హసరంగ: లంకకు చెందిన ఆల్రౌండర్. గత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే కేవల రెండు మ్యాచ్లకే పరిమితమయ్యాడు. అంతర్జాతీయంగా టీ20 స్పెషలిస్ట్ అయిన హసరంగ ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంకర్. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగే హసరంగ 119 స్ట్రైక్ రేట్తో ఇప్పటివరకు టీ20ల్లో 33 మ్యాచుల్లో 319 పరుగులు చేశాడు. బౌలింగ్లో కేవలం 31 ఇన్నింగ్స్ల్లో 52 వికెట్లు పడగొట్టి లంక తరఫున కీలక ఆటగాడిగా ఎదిగాడు.
డు ప్లెసిస్: గత సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్. సీఎస్కే కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు. దక్షిణాఫ్రికా టాప్ ప్లేయర్.. అలాంటి డు ప్లెసిస్ను దక్కించుకోవడానికి ఆర్సీబీకి ఇంకేం కావాలి. దేవ్దుత్ పడిక్కల్ను దక్కించుకోలేకపోయిన ఆర్సీబీ ఓపెనింగ్ లోటును తీర్చుకోవడానికి డుప్లెసిస్ను వేలంలో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?