Badminton: బ్యాడ్మింటన్‌లో తెలంగాణకు స్వర్ణం!

జాతీయ క్రీడల్లో తెలంగాణకు పతకాల పంట పండుతోంది. తాజాగా బ్యాడ్మింటన్‌లో సాయి ప్రణీత్‌ స్వర్ణం గెలిచాడు.

Published : 06 Oct 2022 23:30 IST

అహ్మదాబాద్‌: జాతీయ క్రీడల్లో తెలంగాణకు పతకాల పంట పండుతోంది. తాజాగా బ్యాడ్మింటన్‌లో సాయి ప్రణీత్‌ స్వర్ణం గెలిచాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో కర్ణాటకకు చెందిన మిథున్‌ మంజునాథ్‌పై 21-11, 12-21, 21-16తో విజయం సాధించాడు. దీంతో ఇప్పటివరకు మొత్తం 3 స్వర్ణ పతకాలను తెలంగాణ ఖాతాలో పడ్డాయి. ఆరంభంలోనే దూకుడుగా ఆడిన ప్రణీత్‌ 8-2తో ఆధిపత్యం కొనసాగించాడు. రెండో మ్యాచ్‌లో మిథున్‌ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరివరకు కొనసాగించలేక ఓటమిని చవిచూశాడు. 

మహిళల సింగిల్స్‌ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకర్షి కశ్యప్‌ మహారాష్ట్ర ప్లేయర్‌ మాళవిక బన్సోద్‌పై 21-8, 22-20తో విజయం సాధించింది. మరోవైపు, తన గెలుపుపై ప్రణీత్‌ స్పందించాడు. ‘‘మ్యాచ్‌ నా నుంచి చేజారుతుందనుకున్న సమయానికి నిలకడగా ఆడటానికి ప్రయత్నించాను. మూడో గేమ్‌ను దృష్టిలో ఉంచుకుని 16-15 ఆధిక్యానికి చేరుకోగానే జాగ్రత్తగా ఆడాను’’ అని చెప్పుకొచ్చాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని