Shami: షమీ కోలుకోవాలని అభిమాని ట్వీట్.. మరో క్రికెటర్పై వ్యంగ్యాస్త్రం!
సోషల్ మీడియా వచ్చాక తమ అభిప్రాయాలను తెలియజేయడానికి నెటిజన్లు ఏమాత్రం వెనకాడటం లేదు. సూటిగా చెప్పకుండా వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Shami) తన ఆరోగ్యంపై పోస్టు పెట్టాడు. అభిమానులు కూడా షమీ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఓ అభిమాని పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించి.. ఇప్పుడీ సీజన్లో ముంబయి సారథిగా వచ్చిన హార్దిక్ పాండ్యను ఉద్దేశించి ఆ ట్వీట్ చేశాడని తెలుస్తోంది. సదరు ఫ్యాన్ పెట్టిన పోస్టును షమీ లైక్ చేయడం గమనార్హం.
‘‘షమీ భాయ్ నువ్వు త్వరగా కోలుకుని వస్తావు. వన్డే ప్రపంచ కప్ సందర్భంగానూ గాయం బాధను తట్టుకొని 100 శాతం కష్టపడ్డావు. కానీ, ఓ ఆటగాడు మాత్రం గాయపడినట్లు నటించి ఆ టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్లో ఆడేందుకు శ్రమిస్తున్నాడు’’ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీంతో పాండ్యను టార్గెట్ చేసి పెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేశారు.
అమిత్ షా ట్వీట్.. షమీ థ్యాంక్స్.. తర్వాత డిలీట్
మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. దానికి షమీ ధన్యవాదాలు చెప్పాడు. ‘‘షమీ భాయ్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అనే పోస్టుకు షమీ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యూ సో మచ్ సర్’’ అని కామెంట్ పెట్టాడు. కానీ, దానిని వెంటనే షమీ డిలీట్ చేయడం విశేషం. ఎందుకు అలా చేశాడనేది అభిమానుల్లో చర్చకు తెరలేసింది. అయితే, అమిత్ షా ఒరిజినల్ ట్విటర్ ఖాతా నుంచి ఆ ట్వీట్ రాలేదు. కేంద్ర మంత్రి పేరు మీదనే నకిలీ ఖాతా సృష్టించి.. దానిని నుంచి పోస్టు పెట్టారు. అది గ్రహించిన షమీ తాను పెట్టిన కామెంట్ను డిలీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.