IPL 2024: ఐపీఎల్ 2024.. ఆరంభ మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ దూరం..!
ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) కోసం జట్లన్నీ సమాయత్తం అవుతున్న వేళ.. కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు సారథి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ (IPL 2024) ప్రారంభమవుతున్న వేళ.. ఫ్రాంచైజీలకు గాయాలు, వ్యక్తిగత కారణాలతో ఆటగాళ్లు దూరం కావడం తలనొప్పిగా మారింది. తాజాగా కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చనే కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో శ్రేయస్ ఆడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్లో కీలకమైన 95 పరుగులు చేశాడు. అయితే, మళ్లీ తన వెన్ను నొప్పి తిరగబెట్టిందని.. రంజీ ఫైనల్ ముగిసిన తర్వాత కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
‘‘శ్రేయస్ అయ్యర్కు వెన్ను నొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టింది. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్ ఐదో రోజు మైదానంలోకి దిగలేదు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతాడు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్లో ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి’’ అని క్రీడా వర్గాలు తెలిపాయి. గతేడాది ఇదే సమస్యతో శస్త్రచికిత్స చేయించుకుని వన్డే వరల్డ్ కప్ నాటికి వచ్చాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ మధ్యలో మరోసారి వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టింది. కాస్త కోలుకోవడంతో రంజీ ఫైనల్లో ఆడుతున్నాడు. ఒకవేళ శ్రేయస్ అందుబాటులో లేకపోతే కోల్కతా యాజమాన్యం మళ్లీ నితీశ్ రాణాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందా? కొత్తగా ఎవరినైనా కెప్టెన్ చేస్తుందో చూడాలి. ఈ సీజన్లో కోల్కతా తొలి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్తో మార్చి 23న తలపడనుంది. మార్చి 29న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఏప్రిల్ 3న దిల్లీ క్యాపిటల్స్తో కేకేఆర్ ఆడనుంది.
ఇదే అతిపెద్ద వివాదం: ఏబీ డివిలియర్స్
ముంబయి ఇండియన్స్ సారథిగా హార్దిక్ పాండ్యను నియమిచడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పందించాడు. ‘‘ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. ఐదుసార్లు విజేతగా నిలిచారు. హార్దిక్ పాండ్యను కెప్టెన్గా చేసినప్పటి నుంచి అతిపెద్ద వివాదంగా మారింది. గుజరాత్ టైటాన్స్తో తొలి మ్యాచ్ ఆడనుండటం మరింత ఆసక్తి కలిగించనుంది’’ అని ఏబీడీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక