Mohammed Siraj: సిరాజ్ మియా.. మళ్లీ నంబర్ వన్
ఆసియా కప్ ఫైనల్లో సంచలన ప్రదర్శనతో టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్లో సంచలన బౌలింగ్తో టీమ్ఇండియా సీమర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అతడు ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్ను అందుకోవడం విశేషం. అతడు వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి, మార్చి మధ్య నంబర్ వన్ ర్యాంక్లో కొనసాగాడు. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ భారత వన్డే చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా బౌలింగ్ చేశాడు. అతడి ధాటికి ఆతిథ్య జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒకే ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టిన ఘనత అందుకొన్న తొలి భారత బౌలర్గా నిలిచాడు. మొత్తంగా (6/21)తో కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.
హేజిల్ వుడ్ రెండో స్థానంలో, ట్రెంట్ బౌల్ట్ మూడో స్థానంలో ఉన్నారు. అఫ్గాన్ స్పిన్నర్లు ముజీబుర్ రెహ్మన్, రషీద్ఖాన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆసీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో అదరగొట్టిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల ఆసీస్తో జరిగిన నాలుగో వన్డేలో క్లాసెన్ (174; 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్లు) భారీ శతకంతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. కివీస్తో జరిగిన వన్డే సిరీస్లో టాప్ స్కోరర్ (277)గా నిలిచిన డేవిడ్ మలన్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ (13) అందుకున్నాడు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమ్ఇండియా ఆటగాడు శుభ్మన్ గిల్, సౌతాఫ్రికా బ్యాటర్ డసెన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్