SL vs AFG: అఫ్గాన్ ‘సూపర్’ పోరాటం.. చివర్లో పుంజుకుని గెలిచిన శ్రీలంక
ఆసియా కప్లో సూపర్-4 బెర్త్ కోసం అఫ్గాన్ జట్టు గొప్పగా పోరాడింది. అయితే చివర్లో పుంజుకున్న లంక జట్టు అఫ్గాన్ ఆశలు ఆవిరి చేయడమే కాకుండా 2 పరుగుల తేడాతో గెలిచి సూపర్-4కు దూసుకెళ్లింది.
లాహోర్: ఆసియా కప్లో భాగంగా సూపర్-4లో చోటుకోసం అఫ్గాన్, శ్రీలంక చావోరేవో అన్నట్లు పోరాడాయి. గొప్పగా పోరాడిన అఫ్గాన్ గెలుపుతీరాలకు వెళ్లి చివరి మెట్టు వద్ద బోల్తా పడింది. ఇక ఆసియా కప్ ఆశలు దూరం అవుతున్న సమయంలో పుంజుకున్న శ్రీలంక సూపర్-4 బెర్త్ దక్కించుకోవడమే కాకుండా మ్యాచ్లోనూ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అఫ్గాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే 37.1 ఓవర్లలో 292 పరుగులు చేయాల్సి ఉంది. ఈ తరుణంలో అఫ్గాన్ 37 ఓవర్లకు 289/8 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాతి బంతికి మూడు పరుగులు చేయాల్సిన దశలో వికెట్ కోల్పోవడంతో అఫ్గాన్ సూపర్-4 ఆశలు ఆవిరయ్యాయి. తర్వాత 37.4 ఓవర్ల వద్ద చివరి వికెట్ను కోల్పోయి ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక రెండు పరుగుల తేడాతో గెలిచి సూపర్-4కు దూసుకెళ్లింది.
బౌండరీల వర్షం కురిపించిన నబీ..
లక్ష్యఛేదనలో అఫ్గాన్ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రహమత్ షా (45; 40 బంతుల్లో), హస్మతుల్లా షాహిది (59; 66 బంతుల్లో) నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. తర్వాత మహమ్మద్ నబీ (65; 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లు) బౌండరీల వర్షం కురిపించడంతో అఫ్గాన్ వడివడిగా విజయం దిశగా సాగింది. నబీ ఔటైన తర్వాత కరీమ్ జనత్ (22,; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు), నజిబుల్లా జర్దాన్ (23; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడటంతో అఫ్గాన్ విజయానికి చేరువైంది. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా అఫ్గాన్ ఆటగాళ్లు ధాటిగా ఆడుతుండడంతో శ్రీలంక శిబిరంలో ఆందోళన చెలరేగింది. చివర్లో రషీద్ ఖాన్ (27*; 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పాథూమ్ నిశాంక (41; 40 బంతుల్లో 6 ఫోర్లు), డిముత్ కరుణరత్నె (32; 35 బంతుల్లో 6 ఫోర్లు) శుభారంభం అందించారు. అనంతరం ధాటిగా ఆడిన కుశాల్ మెండిస్ (92; 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆల్రౌండర్ చరిత్ అసలంక (36) ఫర్వాలేదనిపించాడు. 227 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. టెయిండర్లు వెల్లలాగే (33), మహీశ్ తీక్షణ (28) గొప్పగా పోరాడటంతో భారీ స్కోరు సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్