సూర్య అదే జోరు: 47 బంతుల్లో 120

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పరుగుల వరద పారించిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంకా అదే టచ్‌లో ఉన్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీకి ముందు జరిగిన ఓ సన్నాహక టీ20 మ్యాచులో సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు....

Published : 22 Dec 2020 21:36 IST

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పరుగుల వరద పారించిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంకా అదే టచ్‌లో ఉన్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీకి ముందు జరిగిన ఓ సన్నాహక టీ20 మ్యాచులో సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. కేవలం 47 బంతుల్లో 120 పరుగులు సాధించాడు. దీనికి తోడు సచిన్‌ తెందూల్కర్ తనయుడు‌ అర్జున్‌ వేసిన ఓ ఓవర్లో 21 పరుగులు సాధించడం గమనార్హం.

సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీకి ముందుగా టీమ్‌-బి, టీమ్‌-డి ఓ సన్నాహక మ్యాచులో తలపడ్డాయి. బి-జట్టుకు సూర్యకుమార్‌ సారథ్యం వహించగా డి-జట్టుకు యశస్వీ జైస్వాల్‌ నాయకత్వం వహించాడు. కాగా మూడో స్థానంలో దిగిన సూర్య ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. వారి బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 10 బౌండరీలు, 9 సిక్సర్లతో 255.32 స్ట్రైక్‌రేట్‌తో 120 పరుగులు చేశాడు. ఇక అర్జున్‌ తెందూల్కర్‌ వేసిన 13వ ఓవర్లో వరుస బౌండరీలతో 21 పరుగులు సాధించాడు. అంతకుముందు రెండు ఓవర్లు అర్జున్‌ బాగా వేయడం గమనార్హం. సూర్య దూకుడుతో అతడి జట్టు 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

ఇవీ చదవండి
2020.. కోహ్లీ ఏంటి?
క్రికెటర్‌ సురేశ్ రైనా అరెస్టు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని