IND vs NZ: విరాట్‌ ముంబయి టెస్టుకు తిరిగొస్తున్నాడు కాబట్టి..: రహానె

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగీయడంపై టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ న్యూజిలాండ్‌ బాగా ఆడిందని మెచ్చుకున్నాడు...

Updated : 30 Nov 2021 14:10 IST

ఆ నిర్ణయం మేనేజ్‌మెంట్‌ తీసుకుంటుంది

కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగీయడంపై టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ న్యూజిలాండ్‌ బాగా ఆడిందని మెచ్చుకున్నాడు. ఐదో రోజు ఆటలో చివరి సెషన్‌లో భారత విజయానికి ఆరు వికెట్లు అవసరమైన వేళ స్పిన్నర్లు అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టి చివరి వికెట్‌ను సాధించలేక మ్యాచ్‌ను కైవసం చేసుకొనే అవకాశాన్ని కోల్పోయింది. దీనిపై స్పందించిన రహానె.. ‘ఇది చక్కటి క్రికెట్‌ మ్యాచ్‌. ప్రత్యర్థి జట్టు చాలా బాగా ఆడింది. తొలి సెషన్‌ తర్వాత మేం గొప్పగా పుంజుకున్నాం. చివరి వికెట్‌ సాధించడానికి మేం ఎంత చేయాలో అంతా చేశాం. అంతకుమించి భిన్నంగా చేయడానికేమీ లేదనే అనుకుంటున్నా. వెలుతురు మందగించడంతో ఆటను ఆపేయాలన్న అంపైర్ల నిర్ణయం సరైందే. విరాట్‌ ముంబయి టెస్టుకు తిరిగొస్తున్నాడు కాబట్టి తుది జట్టుపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తర్వాత నిర్ణయం తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని