Virender Sehwag: మాక్స్వెల్పై అశ్విన్ దుమ్మెత్తి ఊదడంతో ధోనీకీ కోపం వచ్చింది
మైదానంలో జరిగే విషయాలు అక్కడితోనే వదిలేయాలని, వాటిని బయటపెట్టకూడదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇటీవల దిల్లీ, కోల్కతా జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్లో...
నేనెప్పుడూ ఈ విషయాన్ని బయటపెట్టలేదు: సెహ్వాగ్
ఇంటర్నెట్డెస్క్: మైదానంలో జరిగే విషయాలు అక్కడితోనే వదిలేయాలని, వాటిని బయటపెట్టకూడదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇటీవల దిల్లీ, కోల్కతా జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్లో అశ్విన్, మోర్గాన్ మధ్య ఓ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ త్రిపాఠి విసిరిన త్రో.. పంత్కు తగిలి బంతి దూరంగా వెళ్లడంతో దిల్లీ బ్యాట్స్మెన్ ఒక పరుగు తీశారు. దీనిపై కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే అశ్విన్ ఔటయ్యాక ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. దినేశ్ కార్తీక్ కలగజేసుకొని ఇద్దర్నీ వేరు చేశాడు. అయితే, మోర్గాన్ మాట్లాడుతూ అశ్విన్ చేసింది ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమని పేర్కొంటూ.. ఇంకా ఏవో మాటలు అన్నాడని తెలిసింది. ఈ విషయంపైనే సెహ్వాగ్ ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
మైదానంలో జరిగే విషయాలు అక్కడితో వదిలేయాలని, వాటిని బయటకు తీసుకురావొద్దని చెప్పాడు. ‘ఇప్పుడు అశ్విన్-మోర్గాన్ మధ్య జరిగిన ఉదంతం గురించి కార్తీక్ బయటకు చెప్పకపోయి ఉంటే ‘క్రీడాస్ఫూర్తి’ అనే వివాదం తలెత్తేది కాదు. 2014లో నేను, గ్లెన్ మాక్స్వెల్ పంజాబ్ జట్టుకు ఆడేటప్పుడు.. అశ్విన్ చెన్నైకు ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు ఒక మ్యాచ్లో మాక్స్వెల్ను అతడు ఔట్ చేశాక దుమ్మెత్తి ఊదాడు. అది మరో ఎండ్లో ఉన్న నాకూ నచ్చలేదు. అశ్విన్ అలా చేయడం ద్వారా చెన్నై కెప్టెన్ ధోనీకి కూడా కోపం వచ్చింది. వెంటనే మహీ.. అశ్విన్ను మందలించాడు. ఈ విషయాన్ని నేను అక్కడితోనే వదిలేశాను. దాన్ని మీడియా ముందు లేదా సోషల్ మీడియాలో ఎక్కడా ప్రస్తావించలేదు. అది తప్పో, ఒప్పో లేక క్రీడాస్ఫూర్తికి విరుద్ధమో పట్టించుకోలేదు. అలా చేయడం అశ్విన్ ఇష్టం. కానీ, దాన్ని ఎవరైనా మీడియా ముందు వెల్లడించినా లేదా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నా పెద్ద వివాదాస్పదమయ్యేది. మైదానంలో ఏం జరిగినా అది ఆటగాళ్ల మధ్యే ఉండాలి. బయటకు రాకూడదు. అది వాళ్ల బాధ్యత’ అని వీరూ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?