పాక్ ఆటగాళ్లకు అండగా ఉండాలి: అఫ్రిది
కష్ట సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు అండగా ఉండాలని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అభిమానులకు, విమర్శకులకు పిలుపునిచ్చాడు. తాజాగా ఇంగ్లాండ్తో ఆడిన మూడో వన్డేలోనూ దాయాది జట్టు ఓటమిపాలవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది...
ఇంటర్నెట్డెస్క్: కష్ట సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు అండగా ఉండాలని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అభిమానులకు, విమర్శకులకు పిలుపునిచ్చాడు. తాజాగా ఇంగ్లాండ్తో ఆడిన మూడో వన్డేలోనూ దాయాది జట్టు ఓటమిపాలవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రధాన ఆటగాళ్లు లేని ఇంగ్లాండ్ ద్వితీయశ్రేణి జట్టు పాక్పై 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేయడం అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే అఫ్రిది ఓ వీడియోలో మాట్లాడుతూ ఇలా స్పందించాడు.
‘ఇప్పుడున్న పాకిస్థాన్ ఆటగాళ్లు నైపుణ్యం, సామర్థ్యం పరంగా అత్యుత్తమ ఆటగాళ్లు. నిజం చెప్పాలంటే ఈ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఇంకొంత మంది కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వీళ్లు మంచి ఆటగాళ్లు. సరిగ్గా ఉపయోగించుకోవాలి. వారిలో విజయకాంక్ష నెలకొల్పుతూ ప్రోత్సహించాలి. ఇలాంటి కష్టసమయాల్లో అండగా ఉండాలి. మైదానంలో వాళ్లు పోరాడేంతవరకు నేను ఓటములను అంగీకరిస్తాను. అయితే, కొద్దికాలంగా క్రికెట్ ఎంతో మారిపోయింది. ఇప్పుడు విజయాలు సాధించాలంటే దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలి. అంతకుమించిన దారి లేదు’ అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
అనంతరం రాబోయే టీ20 ప్రపంచకప్పై స్పందించిన మాజీ సారథి.. యూఏఈలో పాకిస్థాన్ జట్టుకు ఘనచరిత్ర ఉందని పేర్కొన్నాడు. ‘యూఏఈలో మనకు మంచి రికార్డు ఉంది. గతంలో పలు మేటి జట్లను కూడా అక్కడ ఓడించాం. అదే ఇప్పుడు టీ20 ప్రపంచకప్లో మన జట్టుకు కలిసివస్తుంది. అక్కడి పిచ్లపై స్పిన్నర్లు, బ్యాట్స్మెన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది’ అని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా, తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసి 331/9 భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (158; 139 బంతుల్లో 14x4, 4x4) భారీ శతకం సాధించగా రిజ్వాన్ (74; 58 బంతుల్లో 8x4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఇంగ్లిష్ జట్టులో జేమ్స్ విన్స్ (102; 95 బంతుల్లో 11x4) శతకం సాధించగా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ లెవిస్ గ్రెగోరీ (77; 69 బంతుల్లో 6x4, 3x6) రాణించాడు. దాంతో ఆతిథ్య జట్టు 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..