Kohli vsGanguly: కోహ్లీ యాటిట్యూడ్ ఇష్టమే కానీ.. బాగా కొట్లాడతాడు: దాదా
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ (వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం) అంటే తనకు చాలా ఇష్టమని, అయితే.. అతడు బాగా కొట్లాడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో ఇద్దరి మధ్య భిన్న స్వరాలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ (వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం) అంటే తనకు చాలా ఇష్టమని, అయితే.. అతడు బాగా కొట్లాడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో ఇద్దరి మధ్య భిన్న స్వరాలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా గురుగావ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదాను విలేకర్లు పలు ప్రశ్నలు వేశారు. ఇప్పుడున్న టీమ్ఇండియా ఆటగాళ్లలో ఎవరి యాటిట్యూడ్ అంటే మీకు ఇష్టమని ప్రశ్నించారు. దీంతో ఆయన ఇలా బదులిచ్చాడు. ‘నాకు కోహ్లీ యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టం.. కానీ, అతడు బాగా కొట్లాడతాడు’ అని పేర్కొన్నాడు.
అనంతరం విలేకర్లు మరో ప్రశ్న వేయగా దాదా తనదైనశైలిలో స్పందించాడు. మీరు జీవితంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. జీవితంలో ఒత్తిడి ఉండదని చెప్పాడు. అయితే.. భార్య, గర్ల్ఫ్రెండ్ లాంటివారు మనల్ని ఒత్తిడిలోకి నెడతారని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక టీమ్ఇండియా గురువారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లిన సమయంలో గంగూలీ మీడియాతో మాట్లాడాడు. తన మాటలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడిన కోహ్లీ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని, దాన్ని మీడియా వదిలేయాలని కోరాడు. కాగా, కోహ్లీని ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే సారథ్యం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై వ్యతిరేకత రావడంతో ఈ విషయాన్ని అతడికి ముందే చెప్పానని గంగూలీ పేర్కొనగా.. అలాంటిదేమీ లేదని కోహ్లీ విలేకర్లకు బదులిచ్చాడు. దీంతో టీమ్ఇండియా క్రికెట్లో పెద్ద దుమారం చెలరేగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM