Virat Kohli - Ravi Shastri: కోహ్లీ-శాస్త్రి విజయవంతమయ్యారా.. లేదా?
విరాట్ కోహ్లీ - రవిశాస్త్రి ద్వయం విజయవంతమైందా లేదా? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వీరిద్దరూ ఎంతో మంది దిగ్గజాలకు సాథ్యం కాని ఫలితాలు సాధించడం ఒక ఎత్తయితే...
ఈ టీ20 ప్రపంచకప్పే చివరి అవకాశం..
విరాట్ కోహ్లీ - రవిశాస్త్రి ద్వయం విజయవంతమైందా.. లేదా? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వీరిద్దరూ ఎంతో మంది దిగ్గజాలకు సాధ్యం కాని ఫలితాలు సాధించడం ఒక ఎత్తయితే.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం కూడా అంతే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. దీంతో ఇద్దరూ తమ చివరి అవకాశంగా ఇప్పుడు జరుగుతోన్న టీ20 ప్రపంచకప్పైనే దృష్టి సారించారు. ఇది గెలిచి మరింత గొప్ప పేరు తెచ్చుకొని విమర్శకుల నోర్లు మూయించాలని చూస్తున్నారు. కాగా, వీరి కాంబినేషన్లో టీమ్ఇండియా ప్రయాణం ఎలా సాగిందో పరిశీలిద్దాం..
కుంబ్లే పాయె.. శాస్త్రి వచ్చే..
2017 జులైలో రవిశాస్త్రి టీమ్ఇండియా కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అంతకుముందు నాటి కోచ్ అనిల్కుంబ్లేతో సారథి విరాట్ కోహ్లీకి అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ఇండియా తొలిసారి ఒక ఐసీసీ ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో కోహ్లీసేనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అనంతరం సచిన్, గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ శాస్త్రిని కోచ్గా నియమించింది. అప్పటి నుంచి వరుసగా నాలుగేళ్లు టీమ్ఇండియా బాధ్యతలు చూసుకున్నాడు మాజీ ఆల్రౌండర్.
చారిత్రక గెలుపు.. కలచివేసే ఓటమి..
శాస్త్రి జట్టు బాధ్యతలు తీసుకున్నాక టీమ్ఇండియా టెస్టుల్లో నంబర్వన్గా ఎదిగింది. మునుపెన్నడూ చూడని ఫలితాలు సాధించింది. 2017-18 దక్షిణాఫ్రికా పర్యటన, 2018 ఇంగ్లాండ్ పర్యటన మినహా మిగతా అన్ని సిరీసుల్లోనూ కోహ్లీసేన విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా 2018-19 ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీ-శాస్త్రి కాంబినేషన్ను ఆకాశానికి ఎత్తింది. ఏ ఆసియా జట్టుకు వీలుకాని, ఏ భారత దిగ్గజ సారథికీ సాధ్యం కాని చారిత్రక విజయాన్ని టీమ్ఇండియా సొంతం చేసుకుంది. తొలిసారి 2-1 తేడాతో కంగారూల గడ్డపై సగర్వంగా కోహ్లీసేన బోర్డర్-గావస్కర్ ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్లో టాప్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తయింది. ముఖ్యంగా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా సెమీస్ లాంటి కీలకపోరులో తడబడింది. అప్పటికే ప్రపంచకప్లో ఐదు సెంచరీలతో సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ సైతం ఆ మ్యాచ్లోనే విఫలమయ్యాడు. జడేజా (77), ధోనీ (50) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. టీమ్ఇండియా విజయానికి చేరవలో వచ్చి ఓటమిపాలైంది. ఇది అభిమానులనే కాకుండా జట్టు సభ్యులను కూడా ఎంతో కలచివేసింది.
టెస్టు ఛాంపియన్షిప్.. మరో చారిత్రక ఘట్టం..
కాగా, ఆ ప్రపంచకప్ సమయంలోనే శాస్త్రి తొలుత రెండేళ్ల కోచింగ్ కాంట్రాక్ట్ ముగిసింది. అయితే, బీసీసీఐ దాన్ని మళ్లీ 45 రోజులకు.. ఆపై మరో రెండేళ్లకు పొడిగించింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభమవ్వగా టీమ్ఇండియా వరుస విజయాలు సాధించింది. విండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయఢంకా మోగించింది. ఇక కొవిడ్-19కు ముందు 2020 ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనే కోహ్లీసేనకు షాకిచ్చింది. అక్కడ టెస్టు సిరీస్ కోల్పోయి ఇబ్బందులు పడింది. తర్వాత కరోనా లాక్డౌన్, ఆపై ఐపీఎల్ 2020 అనంతరం గతేడాది చివర్లో నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అయితే, 2018-19 పర్యటనలో డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్ లాంటి కీలక ఆటగాళ్లు లేని సమయంలో భారత్ ఆస్ట్రేలియాను ఓడించిందనే విమర్శలకు చెక్ పెడుతూ టీమ్ఇండియా మరోసారి చారిత్రక ఘట్టం ఆవిష్కరించింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టాప్ జట్టుగా అడుగుపెట్టింది. అయితే, అక్కడ కూడా కోహ్లీసేన.. విలియమ్సన్ టీమ్ చేతిలో ఓటమిపాలై రెండోసారి ఐసీసీ ట్రోఫీని కోల్పోయింది. ఇలా కోహ్లీసేన.. రవిశాస్త్రి ఆధ్వర్యంలో బాగా ఆడినా రెండు ప్రధాన కప్పులను కోల్పోవడమే పెద్ద లోటుగా ఉంది. ఇప్పుడిక టీ20 ప్రపంచకప్ తర్వాత శాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తుండగా.. కోహ్లీ సైతం పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పనున్నాడు. దీంతో ఎలాగైనా ఈసారి ఐసీసీ కప్పును సాధించాలని వీరు పట్టుదలగా ఉన్నారు. మరి వారి కల నిజం అవుతుందో లేదో వేచి చూడాలి.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
చివరగా వీరిద్దరి కాంబినేషన్లో గణాంకాలు పరిశీలిస్తే టీమ్ఇండియా మేటి ఫలితాలు సాధించిందనే చెప్పాలి. రవిశాస్త్రి పర్యవేక్షణలో కోహ్లీసేన విజయాల శాతం ఇదివరకు ఏ కెప్టెన్-కోచ్కు సాధ్యంకాని రీతిలో ఉన్నాయి. ఈ 1983 ప్రపంచకప్ ఆల్రౌండర్ హెడ్కోచ్గా ఉన్న కాలంలో భారత్ మొత్తం 51 టెస్టులు ఆడగా అందులో 30 విజయాలు సాధించింది. అంటే విజయశాతం 58.80గా నమోదైంది. అంతకుముందు జాన్రైట్ కాలంలో భారత్ 52 టెస్టులాడి 21 విజయాలే సాధించింది. ఆ తర్వాతే 2011 ప్రపంచకప్ అందించిన గ్యారీ కిర్స్టెన్, డంకెన్ ఫ్లెచర్ ఉన్నారు. ఇక 91 వన్డే మ్యాచ్ల్లోనూ కోహ్లీసేన 57 విజయాలతో 62.64 విజయశాతంతో కొనసాగుతోంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?